రెస్టారెంట్ అన్నాక ఒక్కసారిగా ఫుడ్ ఆర్డర్స్ వచ్చిపడటం సర్వసాధారణం. వాటిల్లో కొన్ని సమయానికి అందించవచ్చు. మరికొన్ని లేట్ కావచ్చు. ఈ తరుణంలోనే చాలామంది కస్టమర్లు తమ ఆర్డర్ లేటు అవుతోందని.. కోపద్రుక్తులవుతుంటారు. సరిగ్గా ఈ కోవలోనే తాజాగా ఓ ఘటన న్యూయార్క్లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..
వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్లోని బంగ్లాదేషి రెస్టారెంట్కు 49 ఏళ్ల చోఫెల్ నోర్బు అనే వ్యక్తి వచ్చాడు. బాగా ఆకలి మీదున్న అతడు చికెన్ బిర్యానీని ఆర్డర్ పెట్టాడు. అయితే ఏదో సాంకేతిక సమస్య కారణంగా ఆ ఆర్డర్ కాస్తా లేట్ వచ్చింది. అంతే! మనోడికి కోపం కట్టెలు తెంచుకుంది. ఓ విధమైన మండే ద్రవంతో ఏకంగా రెస్టారెంట్కే నిప్పంటించాడు. ఈ క్రమంలోనే అతడిపైకి కూడా నిప్పులు ఎగిసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు కాగా.. పోలీసులు సదరు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ వీడియోను న్యూయార్క్ అగ్నిమాపక సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
Today, Acting Fire Commissioner Laura Kavanagh announced the arrest of Choephel Norbu. #FDNY Fire Marshals along with @NYPDnews Arson and Explosion Detectives arrested Norbu, 49, for intentionally setting a fire. Read more: https://t.co/151Huk3jDY pic.twitter.com/3Hjhiwbw5J
— FDNY (@FDNY) October 17, 2022
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..