భారతీయులను, వాస్తును వేరు చేసి చూడలేని పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా హిందువులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. అందుకే కొత్తింటి నిర్మాణం మొదలు పెట్టగానే ముందుగా వాస్తు జ్యోతిష్యులను సంప్రదిస్తారు. అయితే కేవలం ఇంటి నిర్మాణానికే పరిమితం కాకుండా ఇంట్లో గదుల నిర్మాణం విషయంలో, వస్తువులు ఏర్పాటు చేసుకునే విధానంలో కూడా వాస్తు చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతుంటారు.
అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని వాస్తు లోపాలు జీవన విధానంపై ప్రభావం చూపుతాయని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా పడకగదిలో ఉండే వాస్తు దోషాలు దంపతుల మధ్య గొడవలకు దారి తీస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్లో బెడ్ను కచ్చితంగా నైరుతి గోడకు అనుకుని ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే నిద్రపోయే సమయంలో దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, తూర్పు లేదా పడమర దిశలకు తల పెట్టుకొని పడుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.
* ఇక ఇంట్లో బెడ్ రూమ్ ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్య మూలలో ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. కేవలం పూజ గదికి మాత్రమే కేటాయించిన ఈశాన్యంలో బెడ్ రూమ్ ఉంటే దంపతుల మధ్య విభేదాలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
* బెడ్ రూమ్లో వీలైనంత వరకు లైట్ కలర్స్ వేసుకోవాలి. లైట్ పింక్, లైట్ బ్లూ వంటి కలర్స్ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.
* ఇక బెడ్ రూమ్లో మంచి సువాసన వచ్చే పర్ఫ్యూమ్ను ఉపయోగించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్లు విడుదలవుతాయి.
* బెడ్ రూమ్ కచ్చితంగా నైరుతి లేదా ఆగ్రేయంలో మాత్రమే ఉండాలి. ఈ దిశలో ఉంటేనే దపంతుల మధ్య బంధం బలోపేతమవుతుంది.
* ఇక బెడ్ రూమ్లో ఏర్పాటు చేసుకునే ఫొటోల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పూలు, మొక్కలు, చిన్న పిల్లలు వంటి ఫొటోలను ఏర్పాటు చేసుకోవాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..