భారతదేశంలో వాస్తుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కొత్తి ఇల్లు అనే ఆలోచన రాగానే ప్రతీ ఒక్కరూ మొదట చేసే పని వాస్తు పండితులను సంప్రదించడం. వాస్తు ఆధారంగానే ఇంటి స్థలం ఎంపిక మొదలు, ఇంటి నిర్మాణం ప్రారంభిస్తారు. ఇక వాస్తు కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా. ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా ఉంటుందని పండితులు చెబుతుంటారు. వృత్తిపరంగా ఇబ్బందులు ఎదురైనా, ఆర్థికంగా కష్టాలు పడుతున్నా వాస్తులో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఎంత కష్టపడినా కెరీర్లో కొత్త అవకాశాలు రాకుండా గ్రోత్ లేకపోయి.. ఇంట్లో ఆనందం దూరమైన ఒక చిన్న వాస్తు చిట్కాను పాటించాలని వాస్తు పండితులు చెబతుఉన్నారు. ఇందుకోసం ఇంటికి ఉత్తరం వైపు చేపల అక్వేరియంను ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. చేపను పాజిటివ్ ఎనర్జీకి సూచికగా చెబుతారు. దీని ఏర్పాటుతో ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఇక అక్వేరియంను ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకుంటే ఆర్థికంగా మెరుగుపడుతారు.
* కొన్ని సార్లు ఎంత కష్టపడి పనిచేసినా ఆర్థికంగా ఎదుగుదల ఉండదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే పోతుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే ఆదాయ మార్గాలు సైతం మూతబడతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తూర్పు లేదా నైరుతి దిశలో ప్రధాన తలుపు వెలుపల ఒక చిన్న ఫౌంటెన్ను ఏర్పాటు చేసుకోవాలి. నీటి ప్రవాహం ఎప్పుడూ ఉండేలా ఈ ఫౌంటెన్ను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి.
* ఇక ఇంట్లో సంతోషం వెల్లివిరియాలన్నా, ఆర్థిక కష్టాలు దూరమవ్వాలన్నా ఇంట్లో దక్షిణం వైపున ఫీనిక్స్ పక్షి ఫొటోను ఏర్పాటు చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఫినిక్స్ పక్షి అనేది శూన్యం నుంచి కూడా ఎదుగుతుందని చెబుతుంటారు.
* ఇంట్లో స్పటిక కమలాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇంట్లో సంపద వస్తుంది. స్పటిక కమలాన్ని ఇంటికి నైరుతి మూలలో ఉంచాలి. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది సంపదను ఆకర్షిస్తుంది.
* ఇటీవల ఇంట్లో మొక్కలు పెంచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మొక్కలను పెంచడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని వాస్తు పండితులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు మొక్కలను నీరు పోయాలని, వాటిని ఎండిపోకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
* ఇక ఇంట్లో ఎంతో కీలకమైన ఈశాన్యం మూల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈశాన్యం మూలలో ఎలాంటి చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..