పారికర్ అంత్యక్రియలకు హాజరుకానున్న ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు
పనాజీ : అనారోగ్యంతో కన్నుమూసిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ కేంద్ర హోంశాఖ.. రక్షణశాఖను కోరింది. మిరామర్ బీచ్లో గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బండోద్కర్ స్మారకం పక్కనే పారికర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గోవా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలిపారు. మనోహర్ పారికర్ పార్థివదేహాన్ని ప్రస్తుతం పనాజీలోని బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చారు. పార్టీ నేతలు నివాళులర్పించిన […]
పనాజీ : అనారోగ్యంతో కన్నుమూసిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ కేంద్ర హోంశాఖ.. రక్షణశాఖను కోరింది. మిరామర్ బీచ్లో గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బండోద్కర్ స్మారకం పక్కనే పారికర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గోవా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలిపారు. మనోహర్ పారికర్ పార్థివదేహాన్ని ప్రస్తుతం పనాజీలోని బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చారు. పార్టీ నేతలు నివాళులర్పించిన అనంతరం ప్రజల సందర్శనార్థం పారికర్ భౌతికకాయాన్ని కాలా అకాడమీకి తరలించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పారికర్ అంతిమయాత్ర ప్రారంభమవుతుందని పార్టీ నేతలు తెలిపారు. 5 గంటలకు మిరామర్ బీచ్లో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. పారికర్ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరుకానున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. పారికర్ మృతికి సంతాపంగా గోవాలో ఇవాళ స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజును సంతాప దినంగా ప్రకటించింది.