‘అల’పై టబు ఆశలు.. నెరవేరుతాయా..?

| Edited By:

Jan 08, 2020 | 1:02 PM

అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ ద్వారా దాదాపు 11 సంవత్సరాల తరువాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వబోతోంది సీనియర్ నటి టబు. ఇందులో ఓ కీలక పాత్రలో ఆమె నటించబోతోంది. స్క్రిప్ట్‌ విన్న వెంటనే ఓకే చెప్పిన టబు.. ఈ మూవీపై చాలా అంచనాలే పెట్టుకుంది. అల వైకుంఠపురములో ద్వారా తనకు మంచి రీ ఎంట్రీ […]

అలపై టబు ఆశలు.. నెరవేరుతాయా..?
Follow us on

అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ ద్వారా దాదాపు 11 సంవత్సరాల తరువాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వబోతోంది సీనియర్ నటి టబు. ఇందులో ఓ కీలక పాత్రలో ఆమె నటించబోతోంది. స్క్రిప్ట్‌ విన్న వెంటనే ఓకే చెప్పిన టబు.. ఈ మూవీపై చాలా అంచనాలే పెట్టుకుంది. అల వైకుంఠపురములో ద్వారా తనకు మంచి రీ ఎంట్రీ ఉండబోతోంది అని ఆమె భావిస్తోంది.

కాగా గతంలో నదియా, ఖుష్బూ ఇద్దరు సీనియర్ హీరోయిన్లకు తన సినిమాలో కీలక పాత్రలు ఇప్పించారు త్రివిక్రమ్. ఆయన తెరకెక్కించిన అత్తారింటికి దారేది, అఆ చిత్రాల్లో నదియా కీ రోల్‌లో నటించగా.. అఙ్ఞ్యాతవాసి ద్వారా ఖుష్బూ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే వీరిలో నదియాకు మాత్రమే మంచి పేరు వచ్చింది. అఙ్ఞ్యాతవాసి ఫ్లాప్ అవ్వడంతో ఖుష్బూకు పేరు రాలేదు సరి కాదా.. ఆఫర్లు కూడా పెద్దగా రాలేదు. మరి ఇప్పుడు ఈ మూవీతో హిట్ కొట్టి తెలుగులో మళ్లీ బిజీ అవ్వాలనుకుంటోన్న టబు ఆశలున అల వైకుంఠపురములో తీరుస్తుందో..? లేదో..? చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.