చైతూకు నో చెప్పిన గీతా మేడమ్..?

|

Oct 19, 2019 | 1:10 PM

‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కస్తూరి రష్మిక మందన్నా.. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం రాకపోయినా.. వరుస హిట్స్ దక్కడంతో ఆనతి కాలంలోనే టాప్ లీగ్‌కు చేరుకుంది. అంతేకాక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం చేస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత రష్మిక ఫేమ్ వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా […]

చైతూకు నో చెప్పిన గీతా మేడమ్..?
Follow us on

‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కస్తూరి రష్మిక మందన్నా.. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం రాకపోయినా.. వరుస హిట్స్ దక్కడంతో ఆనతి కాలంలోనే టాప్ లీగ్‌కు చేరుకుంది. అంతేకాక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం చేస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత రష్మిక ఫేమ్ వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఆమె దిల్ రాజు బ్యానర్‌లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి నో చెప్పిందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అటు దిల్ రాజు బ్యానర్.. ఇటు అక్కినేని వారసుడు.. ఇంతకంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇంకేం ఉంటుంది. ఏ హీరోయిన్ అయినా ఓకే చెబుతుంది. కానీ రష్మిక మాత్రం ఈ సినిమాను ఒప్పుకోలేదట. దానికి కూడా ఓ రీజన్ ఉందని సమాచారం. రెమ్యునరేషన్… ప్రొడ్యూసర్.. హీరోను దృష్టిలో పెట్టుకుని కాకుండా బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే.. అందులో తన పాత్ర నచ్చితేనే ఒప్పుకోవాలని రష్మిక నిర్ణయం తీసుకుందట. అందుకే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చదివిన తర్వాతే ఓ డెసిషన్ తీసుకుంటానని నిర్మాతలు చెప్పినట్లు వినికిడి.

ఈ మధ్య వరుస ప్లాప్స్‌తో రష్మిక క్రేజ్ తగ్గిపోయింది. ఆమె నటించినవి క్రేజీ ప్రాజెక్ట్స్ అయినా.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం నిరాశపరిచాయి. అందుకే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్త పడాలని నిర్ణయం తీసుకుందట ఈ అందాల భామ.