లైవ్‌లో తింటూ కనిపించిన ‘గృహలక్ష్మి’ నటి.. వీడియో వైరల్‌

| Edited By:

Jul 20, 2020 | 3:12 PM

కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ఉండి ఛానళ్ల చర్చల్లో పాల్గొని లైవ్‌లు ఇస్తున్నారు చాలా మంది. ఈ క్రమంలో కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

లైవ్‌లో తింటూ కనిపించిన గృహలక్ష్మి నటి.. వీడియో వైరల్‌
Follow us on

కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ఉండి ఛానళ్ల చర్చల్లో పాల్గొని లైవ్‌లు ఇస్తున్నారు చాలా మంది. ఈ క్రమంలో కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా లైవ్‌లో పాల్గొన్న ప్రముఖ నటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఆమె తింటూ కనిపించగా.. నెటిజన్ల చేత ఆ వీడియో నవ్వులు పూయిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ యాంకర్ అర్నబ్‌ గోస్వామి నిర్వహించిన ఓ లైవ్‌లో నటి కస్తూరి శంకర్‌(భారతీయుడు, అన్నమయ్య ఫేమ్‌) భాగం అయ్యారు. అందులో అర్నబ్‌ మాట్లాడే సమయంలో కస్తూరి తింటూ కనిపించింది. దీన్ని షేర్ చేసిన ఓ నెటిజన్.. ఈ మహిళకు ఉన్న కాన్ఫిడెన్స్‌ నాకు కూడా కావాలి అని కామెంట్ పెట్టారు. దానికి కస్తూరి స్పందిస్తూ.. ”కాన్ఫిడెన్స్‌తో మనం ఏం చేయలేము. అర్నబ్‌ హైపర్‌మోడ్‌లో ఉండటాన్ని 60 నిమిషాలు గమనించా. ఆయన నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు. అందుకే నేనునా లంచ్‌ను తిన్నాను. కానీ స్కైప్‌ నుంచి సైన్‌ ఆఫ్ చేయడం మర్చిపోయా. దీనిపై అందరికి క్షమాపణలు చెబుతున్నా. ఎవ్వరినీ కించపరచాలని కాదు” అని కామెంట్ పెట్టారు. కాగా కస్తూరి ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే.