‘వాల్మీకి’ రాకకు ముహూర్తం ఖరారు

| Edited By:

Jun 10, 2019 | 10:22 AM

వరుణ్ తేజ్, అధర్వ, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తాండ’ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ తేజ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఖరారైంది. సెప్టెంబర్ 6న వాల్మీకి థియేటర్లలో సందడి చేయనున్నాడని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా 14రీల్స్ పతాకంపై రామ్ అటంచ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి.. మిక్కీ జే మేయర్ […]

‘వాల్మీకి’ రాకకు ముహూర్తం ఖరారు
Follow us on

వరుణ్ తేజ్, అధర్వ, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తాండ’ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ తేజ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఖరారైంది. సెప్టెంబర్ 6న వాల్మీకి థియేటర్లలో సందడి చేయనున్నాడని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా 14రీల్స్ పతాకంపై రామ్ అటంచ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వరుణ్ ఈ మూవీలో కొత్త లుక్‌లో కనిపిస్తుండగా.. దీనిపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.