Varun Tej-Lavanya Tripathi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్, లావణ్య.. ఫోటోస్ వైరల్..

|

Aug 14, 2024 | 6:31 PM

మంగళవారం రాత్రి కొండపై బస చేసిన మెగా జంట.. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. గతేడాది నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్టులతో బిజీ అయ్యారు వరుణ్ తేజ్.

Varun Tej-Lavanya Tripathi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్, లావణ్య.. ఫోటోస్ వైరల్..
Varun Tej, Lavanya Tripathi
Follow us on

మెగా హీరో వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి కొండపై బస చేసిన మెగా జంట.. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. గతేడాది నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్టులతో బిజీ అయ్యారు వరుణ్ తేజ్. పెళ్లైన ఇన్నాళ్లకు వీలు చేసుకుని భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుణ్ మట్కా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఇటీవల విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.