అమితాబ్ బచ్చన్ కరోనా నెగటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా చేసిన టెస్టుల్లో ఆయనకు, అభిషేక్ బచ్చన్ కు నెగటివ్ వచ్చినట్టు రూమర్స్ వ్యాపించాయి. తాజాగా ఈ విషయంపై బిగ్ బి రెస్పాండ్ అయ్యారు. కరోనా పరీక్షల్లో తనకు నెగటివ్ వచ్చిందనే వార్తల్లో నిజం లేదని బిగ్బీ ట్వీట్ చేశారు. ఈ వార్తలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని, సరిదిద్దుకోలేని అబద్ధాలని ట్వీట్ లో పేర్కొన్నారు.
.. this news is incorrect , irresponsible , fake and an incorrigible LIE !! https://t.co/uI2xIjMsUU
— Amitabh Bachchan (@SrBachchan) July 23, 2020
ఈ నెల 11న చేయించుకున్న టెస్టుల్లో కోవిడ్ పాజిటివ్ రావడంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో అమితాబ్, అభిషేక్ చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల గురించి, ఫ్యాన్స్ కి సూచనలు చేస్తూ నానావతి హాస్పిటల్ నుంచి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అమితాబ్. కాగా బచ్చన్ ఫ్యామిలీ బావుండాలని దేశవ్యాప్తంగా పూజలు చేశారు అభిమానులు. వారు త్వరగా కోలుకోవాలని పలువరు సెలబ్రిటీలు సైతం ఆకాంక్షించారు.