డైరెక్టర్‌గా మారిన సీనియర్ హీరోయిన్..పూరి ఫుల్ సపోర్ట్..

|

Mar 09, 2020 | 1:07 PM

తెలుగులో ఎన్నో సినిమాల్లో పద్దతైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ హీరోయిన్ కళ్యాణి. మలయాళంలో బాలనటిగా ఎంటరై, ఆ తర్వాత హీరోయిన్‌గా మారి సౌత్‌లో అన్ని భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకున్నారామె. కళ్యాణి తెలుగులో నటించిన మొదటి మూవీ ‘శేషు’. ఆ సినిమాలో నటనతో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేశారు. ఆ తర్వాత సీనియర్ డైరెక్టర్ వంశీ తీసిన  ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో ఉత్తమ నటిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. […]

డైరెక్టర్‌గా మారిన సీనియర్ హీరోయిన్..పూరి ఫుల్ సపోర్ట్..
Follow us on

తెలుగులో ఎన్నో సినిమాల్లో పద్దతైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ హీరోయిన్ కళ్యాణి. మలయాళంలో బాలనటిగా ఎంటరై, ఆ తర్వాత హీరోయిన్‌గా మారి సౌత్‌లో అన్ని భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకున్నారామె. కళ్యాణి తెలుగులో నటించిన మొదటి మూవీ ‘శేషు’. ఆ సినిమాలో నటనతో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేశారు. ఆ తర్వాత సీనియర్ డైరెక్టర్ వంశీ తీసిన  ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో ఉత్తమ నటిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. నటుడు జగపతిబాబు, కళ్యాణి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలు సాధించాయి. ‘లెజెండ్‌’ మూవీలో కూడా ఆమె విలన్ అయిన జగపతిబాబుకి భార్యగా నటించారు. చివరసారిగా తెలుగులో ‘యాత్ర’ మూవీలో కనిపించారు.

ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ దర్శకురాలిగా మారబోతున్నారు. కే2కే ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా విల‌క్షణ ప్రేమ‌క‌థ‌తో  కూడిన సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్‌ మూవీని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. హోలీ సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్, టీజర్ గ్లింప్స్‌ను టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ విడుదల చేశారు. ఈ మూవీలో చేత‌న్ శీను, సిద్ధి, సుహాసిసి మ‌ణిర‌త్నం, రోహిత్ ముర‌ళి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.