నేను సైతం..రైతుల ఉద్యమానికి గాయని బాసట..

| Edited By:

Jan 10, 2020 | 3:34 PM

అమరావతి రైతుల పోరాటానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రైతులను పెయిట్ ఆర్టిస్ట్స్ అంటూ ఎస్విబిసి చైర్మన్ పృథ్వీ వ్యాఖ్యలు చేయడాన్ని మరో సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణ మురళి ఖండించారు. రైతులుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు హీరో నారా రోహిత్ రైతుల ఉద్యమానికి మద్దతుగా త్వరలోనే నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు స్పష్టం చేశారు. తాజాగా ప్రముఖ గాయని స్మిత సైతం అమరావతి రైతుల పోరాటానికి బాసటగా […]

నేను సైతం..రైతుల ఉద్యమానికి గాయని బాసట..
Follow us on

అమరావతి రైతుల పోరాటానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రైతులను పెయిట్ ఆర్టిస్ట్స్ అంటూ ఎస్విబిసి చైర్మన్ పృథ్వీ వ్యాఖ్యలు చేయడాన్ని మరో సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణ మురళి ఖండించారు. రైతులుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు హీరో నారా రోహిత్ రైతుల ఉద్యమానికి మద్దతుగా త్వరలోనే నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు స్పష్టం చేశారు. తాజాగా ప్రముఖ గాయని స్మిత సైతం అమరావతి రైతుల పోరాటానికి బాసటగా నిలిచారు.

రైతుల వేదన చూస్తుంటే గుండె తరక్కుపోతుందని ట్వీట్ చేశారు. వారితో కలిసి ముందుకు నడవడానికి సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అందరూ తమకెందుకులే అనుకుంటున్నారని, కలిసి ముందుకు నడవకుంటే ఏమి సాధ్యం కాదని హితవు పలికారు.