మన్మథుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ దర్శకుడి పేరెత్తని నాగ్..

| Edited By:

Aug 06, 2019 | 7:42 AM

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మరోసారి మన్మథుడు2 గా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్ట్ వన్ డైరెక్టర్ కె. విజయభాస్కర్‌ని తెగ పొగిడారు నాగ్. అలాగే ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌‌కు కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కడా త్రివిక్రమ్ పేరు ఎత్తలేదు. అయితే ఫస్ట్ పార్ట్‌కి కథ, స్క్రీన్ ప్లే అందించింది త్రివిక్రమే. ఈ మూవీ సక్సెస్ కావడానికి త్రివిక్రమ్ పడ్డ కష్టమే ఎక్కువ. తర్వాత కాలంలో […]

మన్మథుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ దర్శకుడి పేరెత్తని నాగ్..
Follow us on

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మరోసారి మన్మథుడు2 గా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్ట్ వన్ డైరెక్టర్ కె. విజయభాస్కర్‌ని తెగ పొగిడారు నాగ్. అలాగే ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌‌కు కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కడా త్రివిక్రమ్ పేరు ఎత్తలేదు. అయితే ఫస్ట్ పార్ట్‌కి కథ, స్క్రీన్ ప్లే అందించింది త్రివిక్రమే. ఈ మూవీ సక్సెస్ కావడానికి త్రివిక్రమ్ పడ్డ కష్టమే ఎక్కువ. తర్వాత కాలంలో త్రివిక్రమ్ డైరెక్టర్‌గా మారినా.. నాగార్జునతో సినిమా చేయలేదు. అయితే తన కుమారుడు అఖిల్‌తో ఫస్ట్ మూవీ చేయాలని అడిగినప్పటికీ త్రివిక్రమ్ ఒప్పుకోలేదట. దీనికి కారణం డెబ్యూ మూవీలు తాను చేయలేనని అన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీంతో ఇద్దరి మధ్య బాగా గ్యాప్ ఉన్నట్టుగా చెప్పుకుంటారు.

2002 లో వచ్చిన ఫస్ట్ పార్ట్‌కి ఇప్పుడు రాబోతున్న సీక్వెల్‌కి చాలా పోలికలు ఉన్నాయి. అదే ఫారిన్ బ్యాక్‌డ్రాప్ ఉంది. ఐతే ఆపేరు వాడుకున్నందుకు గౌరవంగా విజయభాస్కర్‌ని, దేవీని ఈవెంట్‌కి ఆహ్వానించారు. అయితే కార్యక్రమం బాగా జరిగినప్పటికీ ఎక్కడా త్రివిక్రమ్ పేరు మాట్లాడకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్టుగానే అంతా అనుకుంటున్నారు.