Yash: రాకింగ్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యష్ నయా మూవీ మొదలయ్యిందోచ్..

|

Aug 08, 2024 | 12:33 PM

కేజీఎఫ్ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రెండు పార్ట్స్ అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో యష్ నెక్ట్స్ సినిమా గురించి ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. చాలా రోజులు గ్యాప్ తీసుకున్న యష్ ఇప్పుడు టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. 'టాక్సిక్' సినిమా షూటింగ్ గురించి యష్ ఈరోజు (ఆగస్టు 8) ఒక అప్‌డేట్ ఇచ్చారు.

Yash: రాకింగ్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యష్ నయా మూవీ మొదలయ్యిందోచ్..
Yash
Follow us on

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ సినిమా భారీ విజయం సాధించింది. కేజీఎఫ్ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రెండు పార్ట్స్ అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో యష్ నెక్ట్స్ సినిమా గురించి ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. చాలా రోజులు గ్యాప్ తీసుకున్న యష్ ఇప్పుడు టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ గురించి యష్ ఈరోజు (ఆగస్టు 8) ఒక అప్‌డేట్ ఇచ్చారు. ప్రయాణం మొదలైంది’ అంటూ రాసుకొచ్చాడు యష్. ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు అధికారికంగా ధృవీకరించారు. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ సంస్థ ‘టాక్సిక్’ సినిమాను నిర్మిస్తోంది. వెంకట్ కె. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వెంకట్‌తో కలిసి ఉన్న ఫోటోను యష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్ట్‌కి అరగంటలో రెండున్నర లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ ఫోటో ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా వైడ్ గా వైరల్ అవుతోంది. యశ్ ఇటీవల ధర్మస్థలం సూర్యలోని సదాశివరుద్ర ఆలయాన్ని సందర్శించారు. ఈ సమయంలో ఆయన భార్య రాధిక పండిట్, నిర్మాత వెంకట్ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఈరోజు (ఆగస్టు 8) నుంచి బెంగళూరు శివార్లలో షూటింగ్ ప్రారంభమైంది.

ఆగస్ట్ 8న షూటింగ్ ప్రారంభం కావడానికి కారణం కూడా ఉంది. ఎనిమిది నెంబర్ యశ్ లక్కీ నెంబర్ గా భావిస్తారు. ఆయన కూడా ఎనిమిది (జనవరి 8) న జన్మించాడు. నేటి తేదీలో 8ని ఉండటంతో.. 8-8-2024 (2+0+2+4=8). ఈ కారణంగానే ఆగస్ట్ 8 నుంచి షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నటీనటుల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  ఈ మూవీ పాన్ ఇండియా చిత్రం, భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.