Indian 2 Movie: భారతీయుడు 2 సినిమాపై మేకర్స్ షాకింగ్ నిర్ణయం.. నెగిటివ్ టాక్‏తో ఇలా చేశారా..?

|

Jul 17, 2024 | 5:52 PM

డైరెక్టర్ శంకర్ రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత భారతీయుడు సినిమాకు సీక్వెల్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారతీయుడు 2 మాత్రమే కాదు.. త్వరలోనే మూడో భాగం కూడా రానుంది. జూలై 12న థియేటర్లోల విడుదలైన ఇండియన్ 2 సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.

Indian 2 Movie: భారతీయుడు 2 సినిమాపై మేకర్స్ షాకింగ్ నిర్ణయం.. నెగిటివ్ టాక్‏తో ఇలా చేశారా..?
Indian 2 Movie
Follow us on

విక్రమ్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చారు విశ్వనాయకుడు కమల్ హాసన్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కమల్ కెరీర్‏కు మంచి బూస్ట్ ఇచ్చింది. అలాగే ఇటీవల విడుదలైన కల్కి సినిమా సైతం కమల్ హాసన్ ఖాతాలో హిట్ చేర్చింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో వచ్చిన కల్కి సినిమాలో కమల్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న కమల్ కు.. భారతీయుడు 2 సినిమా నిరాశపరిచిందనే చెప్పాలి. డైరెక్టర్ శంకర్ రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత భారతీయుడు సినిమాకు సీక్వెల్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారతీయుడు 2 మాత్రమే కాదు.. త్వరలోనే మూడో భాగం కూడా రానుంది. జూలై 12న థియేటర్లోల విడుదలైన ఇండియన్ 2 సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.

జూలై 12న విడుదలైన ఈ సినిమాకు మిక్డ్స్ టాక్ రావడంతో అటు కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపింది. రోజు రోజుకు భారతీయుడు కలెక్షన్స్ పడిపోవడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు నుంచి ఈ మూవీ నిడివి ఎక్కువగా ఉందని.. అలాగే ఈ సినిమాలో శంకర్ మార్క్ మిస్సైందంటూ కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ విషయంలో అడియన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఇండియన్ 2 నిడివి ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.3.04 నిమిషాల రన్ టైమ్ తో థియేటర్లలోకి వచ్చిన ఇండియన్ 2 సినిమా నిడివి తగ్గించినట్లు లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. దాదాపు 12 నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు అధికారికంగా వెల్లడించింది. మీకు దగ్గర్లోని థియేటర్ కు రన్ టైమ్ తగ్గించిన ఇండియన్ 2 సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ పోస్ట్ చేసింది.

ఇండియన్ 2 సినిమాను దాదాపు ఆరేళ్ల క్రితమే స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈసినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత మొదలైన ఈ మూవీ రెండేళ్లు షూటింగ్ జరుపుకుంది. జూలై 12న విడుదలైన ఈ సినిమా ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.65 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈచిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించగా.. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్రఖని, కాజల్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.