Samantha Ruth Prabhu: సామ్ ఈజ్ బ్యాక్.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతోన్న బ్యూటీ.. లేటెస్ట్ ఫోటో చూస్తే మతిపోవాల్సిందే

|

Feb 01, 2023 | 10:54 AM

ఇప్పుడు పిరియాడికల్ డ్రామా అయిన శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే మయోసైటిస్‌ ఎటాక్‌ అయిన తర్వాత సమంత మరింత సున్నితంగా మారారు.

Samantha Ruth Prabhu: సామ్ ఈజ్ బ్యాక్.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతోన్న బ్యూటీ.. లేటెస్ట్ ఫోటో చూస్తే మతిపోవాల్సిందే
Samantha
Follow us on

సమంత శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సామ్. ఇప్పుడు పిరియాడికల్ డ్రామా అయిన శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే మయోసైటిస్‌ ఎటాక్‌ అయిన తర్వాత సమంత మరింత సున్నితంగా మారారు. అంతకు ముందు ఆమె మాట్లాడే విధానానికి, ఇప్పుడు ఆమె మాట తీరుకూ చాలా మార్పు వచ్చింది. మాటల్లో కాస్త పెద్దరికం కనిపిస్తోంది. ఇప్పుడు కూడా శాకుంతలం ఈవెంట్‌లో సమంతను చూసిన వారందరూ… ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ మధ్య ఎయిర్‌పోర్టులో, కొన్ని ఇంటర్వ్యూస్ లో కనిపించారు సమంత. అయినా ఆమె ఆరోగ్యం గురించి అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. సమంత ఇప్పుడెలా ఉన్నారు? స్పీడుగా నడవగలుగుతున్నారా? గతంలోలాగా ఓపిగ్గానే కనిపిస్తున్నారా? అంటూ ఆరా తీసేవారి సంఖ్య, ఆత్రుతతో ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కువగానే కనిపించింది.

మొన్నామధ్య తెల్లటి కాస్ట్యూమ్స్ తో సమంత శాకుంతలం ఈవెంట్ కి హాజరయ్యారు. దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతున్నప్పుడు ఎమోషనల్‌ కూడా అయ్యారు. యశోద మూవీ రిలీజ్‌కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ కంటతడి పెట్టారు సామ్‌. జీవితంలో ఎన్నిటినో దాటుకుని వచ్చానని అప్పుడు ఎమోషనల్‌ అయ్యారు. శాకుంతలం ప్రాజెక్ట్ గురించి చెబుతూ గుణశేఖర్‌ మాట్లాడుతూ కంటతడిపెడితే, అది చూసి వెంటనే ఎమోషనల్‌ అయ్యారు సమంత. కళ్లజోడు జరిపి, ఆమె కంటతడి పెడుతుంటే చూపరుల మనసూ ద్రవించింది.

శకుంతలం ఈవెంట్‌లో సమంత చూడ్డానికి కాస్త నీరసంగానే కనిపించారు. ఓపిక లేకున్నా, ఓపిక తెచ్చుకుని ఇక్కడికి వచ్చానని అన్నారు సామ్‌. శాకుంతలం ట్రెయిలర్‌ లాంచ్‌లో ఎడమచేతికి ఓ పూసలదండను చుట్టుకున్నారు సామ్‌. అది జపమాల అని అంతా అనుకున్నారు. 64 పూసలున్న దండను సమంత క్యారీ చేశారు.

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించారు సామ్‌. శిల్పారెడ్డితో కలిసి కేదార్‌నాథ్‌తో పాటు పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించారు. ఐస్‌ స్కేటింగ్‌ చేశారు. చేయాల్సిన సాహసాల లిస్టు రాసుకుని ఒక్కొక్కదానికీ టిక్కు పెట్టేసే టైమ్‌ వచ్చిందని అప్పట్లో అన్నారు. మయోసైటిస్‌ తర్వాత దాని గురించి ఆలోచించట్లేదు సామ్‌. గతంలోనూ కోయంబత్తూర్‌ ఈషా ఫౌండేషన్‌కి కూడా వెళ్లారు సమంత. అయితే సామ్ తిరిగి యాక్టివ్ కావాలని.. పాత సామ్ ను చూడాలని ఉందంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. సామ్ పూర్తిగా కోలుకొని తిరిగి యాక్టివ్ అవ్వాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. అభిమానులు కోరుకున్నట్టే సామ్ ఈజ్ బ్యాక్ అనేలా ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందాలు ఆరబోస్తూ ఫొటోకు ఫోజ్ ఇచ్చింది సామ్. ఈ సూపర్ స్టైలిష్ ఫోటో పై మీరూ ఓ లుక్కేయండి.