సెకండ్ సినిమాపై ‌ బ్ర‌హ్మాజీ త‌న‌యుడు ఫోక‌స్…

|

Jul 15, 2020 | 4:45 PM

టాలీవుడ్ లో మంచి ఆర్టిస్టుల లిస్టులో బ్ర‌హ్మజీ ముందువ‌రస‌లో ఉంటారు. మంచి..మంచి పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో ప్లేస్ సంపాదించుకున్నారు.

సెకండ్ సినిమాపై ‌ బ్ర‌హ్మాజీ త‌న‌యుడు ఫోక‌స్...
Follow us on

టాలీవుడ్ లో మంచి ఆర్టిస్టుల లిస్టులో బ్ర‌హ్మజీ ముందువ‌రస‌లో ఉంటారు. మంచి..మంచి పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో ప్లేస్ సంపాదించుకున్నారు. కాగా ఆయ‌న త‌న‌యుడు ‘పిట్ట క‌థ’ అనే మూవీతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి స‌హా పెద్ద, పెద్ద స్టార్స్ ప్ర‌మోట్ చేసిన‌ప్ప‌టికీ ఈ సినిమా పెద్ద‌గా ఆద‌ర‌ణ పొంద‌లేదు. అందుకే ఈసారి ఓ మంచి చిత్రంతో అల‌రించేందుకు సంజ‌య్ సిద్ద‌మైన‌ట్టు తెలుస్తుంది. యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రం రూపొందించ‌నున్న‌ట్టు స‌మాచారం.

అడ‌ల్ట్ కామెడీ సినిమాగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో దివంగ‌త డైరెక్ట‌ర్ శోభ‌న్ కూమారుడు సంతోష్ శోభ‌న్ మరో లీడ్ రోల్ పోషించ‌నున్నాడు. సంజ‌య్, సంతోష్‌లు ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదాన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. చాలా త‌క్కువ బడ్జెట్‌తో వైజాగ్‌లో షూట్ చేయ‌నున్నారు. కోవిడ్ వ్యాప్తి త‌గ్గ‌గానే ఈ‌ చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది.