Akshay Kumar: స్టార్ హీరోను మోసం చేసిన నిర్మాతలు.. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదంటూ ఆవేదన..

|

Jul 25, 2024 | 1:30 PM

కొన్నిరోజులుగా తన కొత్త సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న అక్షయ్ కుమరా్ తన కెరీర్, వరుస పరాజయాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన మోసాన్ని అక్షయ్ కుమార్ బయటపెట్టాడు. తన జీవితంలో కొందరు నిర్మాతలు తనను మోసం చేశారని.. ఒకరిద్దరు నిర్మాతలు పారితోషికం ఇవ్వలేదని.. ఇది మోసమే కదా అని అన్నారు. తనను మోసం చేసిన వ్యక్తులను ఏమి అనకుండా వారికి దూరంగా ఉంటానని అన్నారు.

Akshay Kumar: స్టార్ హీరోను మోసం చేసిన నిర్మాతలు.. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదంటూ ఆవేదన..
Akshay Kumar
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది ఈహీరో నటించిన 2 సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఇప్పుడు మరో సినిమా ‘ఖేల్ ఖేల్ మే’ ఆగస్టు 15 న విడుదల కానుంది. అక్షయ్ కుమార్ చివరిసారిగా ‘బడే మియాన్ ఛోటే మియాన్’ చిత్రంలో కనిపించారు. ఇక ఇప్పుడు శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన ‘స్త్రీ 2’ చిత్రం కూడా ఇదే రోజున విడుదల కానుంది. అయితే కొన్నిరోజులుగా తన కొత్త సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న అక్షయ్ కుమరా్ తన కెరీర్, వరుస పరాజయాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన మోసాన్ని అక్షయ్ కుమార్ బయటపెట్టాడు. తన జీవితంలో కొందరు నిర్మాతలు తనను మోసం చేశారని.. ఒకరిద్దరు నిర్మాతలు పారితోషికం ఇవ్వలేదని.. ఇది మోసమే కదా అని అన్నారు. తనను మోసం చేసిన వ్యక్తులను ఏమి అనకుండా వారికి దూరంగా ఉంటానని అన్నారు.

“వ్యక్తిగత జీవితంలోనే కాదు.. వృత్తిపరంగానూ మనల్ని మోసం చేసేవాళ్లు ఉంటారు. అన్ని రంగాల్లోనూ ఇది సర్వసాధారణం. నన్ను కూడా చీట్ చేసిన వాళ్లు ఉన్నారు. విషయం తెలిసిన తర్వాత అలాంటివారికి దూరంగా ఉంటాను. వాళ్లతో మాట్లాడుకుండా దూరంగా వెళ్లిపోతాను. కొందరు నిర్మాతలు ఇప్పటికీ నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. నాకు చెందాల్సిన పారితోషికం ఇవ్వలేదు. ఇది మోసమే కదా.. నా దృష్టిలో మాత్రం మోసంతోనే సమానం” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ ఏడాదిలో చాలా చిత్రాలకు సైన్ చేయడం గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. రెండేళ్లలో ఒక్క సినిమా ఎంచుకుంటే అది బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధిస్తుందన్న గ్యారెంటీ లేదన్నారు. నటీనటులు సినిమాకు సంతకం చేయడం, అది ఫ్లాప్ కావడం తాను బాలీవుడ్‌లో చూశానని, దాని ఫలితంగా వచ్చే ఏడాది వారికి ఎలాంటి ప్రాజెక్ట్ ఉండదని అక్షయ్ చెప్పాడు.

అక్షయ్ కుమార్ గత కొంత కాలంగా వరుసగా ఫ్లాప్ చిత్రాలను ఎదుర్కొంటున్నాడు. ఆమె, టైగర్ ష్రాఫ్ నటించిన ‘బడే మియాన్ ఛోటే మియాన్’ చిత్రాలు నిరాశపరిచాయి. ఇటీవల జూలై 12న, అక్షయ్ కుమార్ చిత్రం ‘సర్ఫిరా’ విడుదలైంది. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాకపోవడంతో ఫ్లాప్ అయింది. 80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘సర్ఫిరా’ 13 రోజుల్లో 30 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన ‘ఖేల్-ఖేల్ మే’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ‘స్కైఫోర్స్’, ‘సింగమ్ ఎగైన్’, ‘వెల్‌కమ్ టు ది జంగిల్’, ‘కన్నప’, ‘హేరా ఫేరి 3’ చిత్రాల్లో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.