సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బడా స్టార్స్, మేకర్స్ చిత్రపరిశ్రమలో బందుప్రీతి చూపిస్తున్నారంటూ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఇండస్ట్రీలో వారసత్వం అనేది కేవలం వెండితెరకు పరిచయం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప, నిలబెట్టడానికి కాదని అంటూ కొందరు తమ వాదనలు వినిపించారు. మరికొందరు నెపోటిజం ఎక్కడ లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఆస్కార్ అవార్డ్ విన్నర్, ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూతురు నటిగా పరిచయం కానున్నట్టు సమాచారం.
రెహమాన్కి ముగ్గురు కూతుర్లు ఉండగా, వారిలో రహిమ రెహమాన్ ఒకరు. ఈమె సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండడంతో.. నెటిజన్స్కి కొంత సుపరిచితమే. తండ్రి వారసత్వాన్ని పునికి పుచుకున్న ఈమె.. కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. తాజాగా రహిమ ఇప్పుడు నటనలో ట్రైనింగ్ తీసుకునేందుకు రెడీ అవుతుందట. వచ్చే ఏడాదిలో బాలీవుడ్ తెరపై తన లక్ టెస్ట్ చేసుకునేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం.