అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘యు/ఎ’ సర్టిఫికేట్ తెచ్చుకున్న ఈ మూవీ నేడు(జనవరి 6) బిగ్గెస్ట్ మ్యూజికల్ నైట్ సంబరాలు జరుపుకునేందుకు సిద్దమైంది. హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందులో ప్రధాన తారగణం మొత్తం పాల్గొననున్నారు. ఇక ఈ వేడుకకు పవన్ గానీ.. చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరు గానీ ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరగని రీతిలో ఈ ఈవెంట్ ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్ నుంచి సమాచారం అందుతోంది. మిరుమిట్లు గొలిపే లైట్లతో భారీ స్టేజ్ హైలెట్గా నిలబోతున్నట్టు మూవీ యూనిట్ చెబుతోంది. ఇక సినిమాలో పాటలు పాడిన రియల్ సింగర్స్ అందరూ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.
పూజా హెగ్డే ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన ఆడిపాడబోతోంది. సీనియర్ టబు చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, నవదీప్, సుశాంత్, సచిన్ ఖేడ్ కర్, సముద్ర ఖని, జయరాం, సునీల్, నివేతా పేతురాజ్ లీడ్ రోల్స్లో నటించారు.
‘అల వైకుంఠపురములో’ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ లైవ్ దిగువన చూడండి :