Bigg Boss Telugu 4 :తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 30వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు స్టార్ మా వర్గాల సమాచారం. మరో వారం రోజుల్లో అందుకు సంబంధించిన ప్రోమోలు సైతం విడుదల కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కంటెస్టెంట్స్ జాబితాపై కూడా ఓ క్లారిటీ వస్తోంది. ఇప్పటికే ఎంపిక పూర్తి అయినట్లు సమాచారం. ఈ సారి కాస్త విలక్షణ కంటెస్టెంట్లు షోలో అలరించనున్నారట. ఈ క్రమంలోనే యూట్యూబ్ స్లార్, ఫ్రస్టేటెడ్ విమెన్ సునయన కూడా షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అడపాదడపా సినిమాల్లో మెరిసిన సునయన..ప్రజంట్ యూట్యూబ్ వీడియోలతో తెగ సందడి చేస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆమెను సెలక్ట్ చేసినట్టు సమాచారం. కాగా ఆమె ఈ షోలో ఎపిసోడ్ కు లక్ష రూపాయలు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై సునయన స్పందించారు.
ఈ రూమర్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియడం లేదని..తనను షో కోసం ఎవరూ అప్రోచ్ అవ్వలేదని స్పష్టం చేశారు. తనకు ఇప్పుడు మూడున్నర ఏళ్ల కొడుకు ఉన్నాడని, అతడే ప్రస్తుతం తన లోకం అని నటి చెప్పుకొచ్చింది. అతడికి 7,8 ఏళ్లు వచ్చేవరకు మరోవైపు పెద్దగా ఫోకస్ పెట్టనని సునయన వివరించింది.
Read More :ప్రముఖ నటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్..