కేరళను కుదిపేసిన వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో అష్టకష్టాలు పడుతున్న వారికి సినీ తారల నుంచి సాయం అందుతోంది. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు తెలుగు సూపర్ స్టార్స్ చిరంజీవి, రామ్చరణ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించారు. అలాగే అల్లు అర్జున్ కూడా కేరళ బాధితులకు రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఇకఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకు వచ్చారు. కేరళ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్లు సాయం అందించారు రెబల్ స్టార్ ప్రభాస్. దాంతో ప్రభాస్ దాన గుణాన్నీ అందరూ ప్రశంసిస్తున్నారు.
వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు సహాయ నిధికి విరాళాలు అందించారు. సూర్య, జ్యోతిక, కార్తీ రు. 50 లక్షలు, మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ రు. 35 లక్షలు, మోహన్ లాల్ రు. 25 లక్షలు, కమల్ హాసన్ రు. 25 లక్షలు, ఫహద్ ఫాసిల్, నజ్రియా రు. 25 లక్షలు, టోవినో రు.25 లక్షలు, నయనతార రు.20 లక్షలు అందించారు.
అలాగే విక్రమ్ రు.20 లక్షలు. శివన్ రూ. 20 లక్షలు, సౌబిన్ షాహిర్ రు.20 లక్షలు, రష్మిక మందన రు.10 లక్షలు, మంజు వారియర్, పెర్లీ మణి, రిమీ టామీ ఒక్కొక్కరిరు రూ. 5 లక్షలు, నవ్య నాయర్ రు. 1 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఇక ఇప్పుడు ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళంగా అందించారు. దాంతో ఫ్యాన్స్ ప్రభాస్ మంచి మనసును మరోసారి కొనియాడుతున్నారు. రియల్ లైఫ్ లోనూ ప్రభాస్ కర్ణుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
#Prabhas generously donates Rs. 2 crore for #Kerala CM Relief Fund to help victims of #Wayanad Landslide 🙏
Darling For a Reason❤️ #WayanadLandslide #Kerala pic.twitter.com/gw58N88xbf
— BA Raju’s Team (@baraju_SuperHit) August 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.