‘విరాటపర్వం’ ఇప్పట్లో లేనట్లేనా..!

|

Sep 15, 2020 | 7:44 PM

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం 1992’.

విరాటపర్వం ఇప్పట్లో లేనట్లేనా..!
Follow us on

Virata Parvam Movie: రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం 1992’. తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తి కాగా.. కరోనాతో  వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. ఇక తాజాగా రానా పెళ్లి కావడంతో.. అతడు ఈ ఏడాది మొత్తం షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆల్రెడీ ఒప్పుకున్న హిందీ సినిమాతో పాటు మరో తెలుగు సినిమాకు వచ్చే ఏడాది ముందుగా డేట్స్ ఎడ్జస్ట్ చేయాల్సి ఉండటంతో విరాటపర్వం మళ్లీ సెట్స్ మీదకు వెళ్లాలంటే మరో ఏడాది పట్టే అవకాశం ఉందని సమాచారం. టబు, ప్రియమణి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.