జయాపజయాలను పట్టించుకోకుండా కథలకు ఓకే చెప్పుకుంటూ పోతున్న మిల్కీబ్యూటీ తమన్నా చేతి నిండా ఇప్పుడు సినిమాలు ఉన్నాయి. అటు సీనియర్, ఇటు జూనియర్ హీరోలిద్దరినీ కవర్ చేసుకుంటూ పోతున్న ఈ భామ తాజాగా ఓ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా త్రినాథరావు ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా తమన్నాను అనుకున్నారు. ఈ క్రమంలో ఆమెతో సంప్రదింపులు జరపగా.. పాత్ర నచ్చిన మిల్కీబ్యూటీ సినిమాకు వెంటనే ఓకే చెప్పిందట.
ఇక ఈ చిత్రం కోసం మేకర్స్ 2.5కోట్లు ఇస్తామని తెలిపారట. అయితే 3 కోట్లు డిమాండ్ చేసిన తమన్నా.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం తమన్నా తెలుగులో గోపిచంద్ సరసన సిటీమార్, హిందీలో నవాజుద్దీన్ సిద్ధిఖ్వీ సరసన బోలే చుడియాన్ చిత్రాల్లో నటిస్తోంది.
Read This Story Also: చిరు అన్నయ్య.. మీ ఏకలవ్య శిష్యుడిగా ఈ ‘లూజర్’ మీకు అంకితం