Sushant case live news: బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసు మిస్టరీ సినిమాను తలపిస్తోంది. ఇందులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. అంతేకాదు రాజకీయంగానూ సుశాంత్ కేసు హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో సుశాంత్ మృతదేహాన్ని చూసిన అంబులెన్స్ డ్రైవర్ సంచలన విషయాలు వెల్లడించారు. చనిపోయినప్పుడు సుశాంత్ శరీరం పసుపుగా మారిందని, ఆత్మహత్య చేసుకున్నప్పుడు అలా ఉండదని డ్రైవర్ తెలిపారు. అంతేకాదు సుశాంత్ మోకాళ్లు వంగి ఉన్నాయని, సూసైడ్ చేసుకొని మరణించిన వారి మోకాళ్లను తాను ఎప్పుడూ చూడలేదని వెల్లడించారు. కాగా సుశాంత్ది ఆత్మహత్య కాదు హత్య అని పలువురు ఆరోపణలు చేస్తోన్న క్రమంలో.. ఇప్పుడు అంబులెన్స్ డ్రైవర్ చెప్పిన వ్యాఖ్యలు వాటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కాగా ఈ సుశాంత్ కేసులో సీబీఐ ఇప్పటికే రియా సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. మరోవైపు ఈడీ అధికారులు రియాను రెండోసారి విచారిస్తున్నారు.
Read This Story Also: త్వరగా విచారణ చేపట్టండి: సుప్రీంకు ఏపీ ప్రభుత్వం లేఖ