సుశాంత్​ మృతి కేసులో విచారణకు మహేశ్​ భట్​

|

Jul 26, 2020 | 11:09 PM

బాలీవుడ్​ యువ హీరో సుశాంత్​ సూసైడ్ కేసులో ముంబయి పోలీసులు విచారణ వేగ‌వంతం చేశారు.

సుశాంత్​ మృతి కేసులో విచారణకు మహేశ్​ భట్​
Follow us on

Sushant Singh Rajput Suicide case : బాలీవుడ్​ యువ హీరో సుశాంత్​ సూసైడ్ కేసులో ముంబయి పోలీసులు విచారణ వేగ‌వంతం చేశారు. తాజాగా ప్రముఖ ద‌ర్శ‌క‌నిర్మాత మ‌హేశ్​ భట్ వాంగ్మూలాన్ని మరో రెండు రోజుల్లో తీసుకోనున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ వెల్ల‌డించారు. ఆయనతో పాటు కరణ్​ జోహర్​ మేనేజర్​నూ విచారణకు పిలిచినట్లు తెలిపారు. అవసరమైతే కరణ్​ను సైతం విచారిస్తామ‌ని స్పష్టం చేశారు. ఇక సుశాంత్ మ‌ర‌ణంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోన్న‌ నటి కంగనా రనౌత్​కూ సమన్లు జారీ చేసినట్లు మంత్రి వివ‌రించారు.

సుశాంత్​ చనిపోవడానికి అతని వృత్తిపరంగా జ‌రిగిన సంఘ‌ట‌న‌లే కార‌ణ‌మ‌ని పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో.. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జ‌రుపుతున్నారు. ఈ క్రమంలోనే డైరెక్ట‌ర్ సంజయ్​ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, సినిమా క్రిటిక్​ రాజీవ్​ మసంద్​ సహా ఇప్పటి వరకు 37 మందిని విచారించారు. మరోవైపు ఇటీవలే డిస్నీ హాట్​స్టార్​లో విడుదలైన సుశాంత్​ చివ‌రి చిత్రం ‘దిల్​ బెచారా’ సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.

Read More : రైతు కుటుంబానికి ట్రాక్ట‌ర్ పంపిన సోనూ..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఫోన్