వారిపై చర్యలు తీసుకోండిః కేటీఆర్‌కు సింగర్ సునీత విఙ్ఞప్తి

| Edited By:

Mar 22, 2020 | 1:33 PM

ఓ వార్త కోసం తన ఫొటోను వాడుకున్నారని.. దీనిపై యాక్షన్ తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రిక్వెస్ట్ చేశారు సింగర్ సునీత. అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

వారిపై చర్యలు తీసుకోండిః కేటీఆర్‌కు సింగర్ సునీత విఙ్ఞప్తి
Follow us on

ఓ వార్త కోసం తన ఫొటోను వాడుకున్నారని.. దీనిపై యాక్షన్ తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రిక్వెస్ట్ చేశారు సింగర్ సునీత. అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని వెల్లడించిన ఓ యూట్యూబ్‌ ఛానెల్.. థంబ్‌నైల్‌లో సునీత ఫొటోను బ్లర్ చేసి పెట్టారు. అది కాస్త ఆమె దృష్టికి చేరడంతో దీనిపై యాక్షన్ తీసుకోవాలంటూ విఙ్ఞప్తి చేశారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన సునీత.. ”చందమామ కథలు అనే ఓ ఫేస్‌బుక్‌ పేజీ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పే వార్తకు నా ఫొటోను థంబ్‌నైల్ పెట్టారు. ఇది చాలా ఇబ్బందికి గురిచేసింది. సంబంధిత అధికారులు దీనిపై యాక్షన్ తీసుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నా. నేను బావున్నా” అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు తెలంగాణ డీజీపీ, మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎంఓ, తెలంగాణ పోలీసులను ఆమె ట్యాగ్ చేశారు. కాగా బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌.. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇటీవల వెల్లడించారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఆమెకు లక్నో విమానాశ్రయంలో కరోనా టెస్ట్ చేశారు. ఆ రోజున కనికాకు విపరీతమైన జ్వరం ఉండగా.. ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టి కావాలని నిర్లక్ష్యం చేసినందుకు గానూ లక్నో పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Read This Story Also: కరోనాను జయించబోతున్నాం.. మెడిసిన్ దొరికేసిందటూ ట్రంప్ ట్వీట్..!