రితికా సింగ్ ‘మీ టూ’ మూవీకి సెన్సార్ అడ్డంకులు

|

Mar 08, 2019 | 3:30 PM

‘మీ టూ’ అనే మూమెంట్ సమాజంలోని అన్ని రంగాల్లో చీకటి పొరలను ఎత్తి చూపించింది. చిత్ర పరిశ్రమలో అంతకుమించి ప్రకంపనలు సృష్టించింది. అయితే ఇప్పుడు ‘మీ టూ’ అనే టైటిల్ తో తీసిన చిత్రం వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇచ్చేందుకు కేంద్ర సెన్సార్ బోర్డు నిరాకరించింది. ఈ టైటిల్ ని మార్చాలని, కొన్ని సన్నివేశాలను, సంభాషణలను ఎడిట్ చేస్తేనే ఈ మూవీ విడుదలకు అనుమతిస్తామని పేర్కొంది. హర్షవర్ధన్ అనే దర్శకుడు..తీసిన ఈ […]

రితికా సింగ్ మీ టూ మూవీకి సెన్సార్ అడ్డంకులు
Follow us on

‘మీ టూ’ అనే మూమెంట్ సమాజంలోని అన్ని రంగాల్లో చీకటి పొరలను ఎత్తి చూపించింది. చిత్ర పరిశ్రమలో అంతకుమించి ప్రకంపనలు సృష్టించింది. అయితే ఇప్పుడు ‘మీ టూ’ అనే టైటిల్ తో తీసిన చిత్రం వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇచ్చేందుకు కేంద్ర సెన్సార్ బోర్డు నిరాకరించింది. ఈ టైటిల్ ని మార్చాలని, కొన్ని సన్నివేశాలను, సంభాషణలను ఎడిట్ చేస్తేనే ఈ మూవీ విడుదలకు అనుమతిస్తామని పేర్కొంది. హర్షవర్ధన్ అనే దర్శకుడు..తీసిన ఈ చిత్రంలో గురు మూవీ హీరోయిన్ రితికా సింగ్ ప్రధాన పాత్ర పోషించింది. అమాయకురాలైన ఓ యువతిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి కారులోనే ఆమెపై అత్యాచారం చేసిన ఘటన నేపథ్యంగా ఈ సినిమా సాగింది. హర్యానాలో నెలరోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ జరిగింది.

అయితే ‘మీ టూ’ ఉద్యమాన్ని ఈ మూవీ తప్పుదారి పట్టించేదిగా ఉందని, అందువల్ల మొదట ఈ సినిమా టైటిల్ మార్చాలని ముంబైలోని సెన్సార్ బోర్డు మేకర్స్ కు సూచించింది. బోర్డు సర్టిఫికేట్ కోసం హర్షవర్ధన్ గత ఏడాది అక్టోబరులో సెన్సార్ బోర్డుకు దరఖాస్తు పెట్టుకోగా.. బోర్డు..ఇలా మడత పేచీ పెట్టి..విడుదలను అడ్డుకుంది. దీంతో ఈ మూవీ మేకర్స్ ఈ నెల 6 న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ…సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయం భావప్రకటనా స్వేచ్చను హరిస్తోందని ఆరోపించారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాగలదని ఆశిస్తున్నట్టు ఈ చిత్రం మేకర్స్ తరఫు లాయర్ శిల్పి జైన్ పేర్కొన్నారు.