రణ్‌బీర్‌కి కరోనా పాజిటివ్‌.. ఫైర్ అయిన సోదరి

| Edited By:

Jul 13, 2020 | 2:10 PM

బాలీవుడ్‌లో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే బచ్చన్‌ ఫ్యామిలీలో జయా బచ్చన్‌ మినహా అమితాబ్‌, అభిషేక్‌, ఐశ్వర్య, ఆద్యాలకు కరోనా సోకింది.

రణ్‌బీర్‌కి కరోనా పాజిటివ్‌.. ఫైర్ అయిన సోదరి
Follow us on

బాలీవుడ్‌లో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే బచ్చన్‌ ఫ్యామిలీలో జయా బచ్చన్‌ మినహా అమితాబ్‌, అభిషేక్‌, ఐశ్వర్య, ఆద్యాలకు కరోనా సోకింది. అలాగే అనుపమ్ ఖేర్ ఫ్యామిలీలోనూ నలుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. వీరితో పాటు పలువురు నటీనటులకు ఈ మహమ్మారి వచ్చింది. ఈ క్రమంలో రణ్‌బీర్ కుటుంబంలోనూ కరోనా వచ్చిందని ఇటీవల వార్తలు వచ్చాయి.

రణ్‌బీర్ కపూర్,‌‌ ఆయన తల్లి నీతూ కపూర్‌ ఇద్దరికి కరోనా వచ్చినట్లు కొంతమంది సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. వీరితో పాటు కరణ్ జోహార్‌, అగస్త్య నంద(శ్వేతా బచ్చన్ కుమారుడు )కి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తమ ట్వీట్‌లలో పేర్కొన్నారు. ఇవి కాస్త వైరల్‌గా మారడంతో.. వాటిపై రణ్‌బీర్ సోదరి రిద్ధిమా కపూర్ సహాని స్పందించారు. ”కనీసం వెరిఫై చేసుకోండి. మేము ఆరోగ్యంగా ఉన్నాం. ఫిట్‌గా ఉన్నాం. ఇలాంటి వదంతులను ప్రచారం చేయడం ఆపండి” అని రిద్ధిమా తన ఇన్‌స్టా అకౌంట్‌లో పేర్కొన్నారు.