రవితేజ ‘క్రాక్’ కోసం తమన్ సంగీతసారథ్యంలో అనిరుధ్ ఆలపించిన ‘భలేగా తగిలావే బంగారం’

| Edited By: Pardhasaradhi Peri

Dec 12, 2020 | 1:32 PM

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుససినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుత్తం షూటింగ్ దశలో ఉంది. ఇటీవల రవితేజ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి.

రవితేజ క్రాక్ కోసం తమన్ సంగీతసారథ్యంలో అనిరుధ్ ఆలపించిన భలేగా తగిలావే బంగారం
Follow us on

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుససినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ మధ్య రవితేజ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని కసిమీదఉన్నడు రవితేజ. క్రాక్ మూవీలో పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నాడు మాస్ రాజా.

సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ – సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన క్రాక్ ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమానుంచి రేపు ఓ సాంగ్ ను విడుదల చేయనున్నారు. ‘భలేగా తగిలావే బంగారం..’ అంటూ సాగే సాంగ్ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ పాటను డిసెంబర్ 13న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు.ఈ పాటను యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ పాడటం విశేషం. ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కలిపి పాటకు పని చేయడంతో ‘భలేగా తగిలావే బంగారం..’ పాటపై అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.