‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ చిత్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రాశీకన్నా.. ఆ హీరోయిన్‌ డేట్స్ కుదరకనే..

| Edited By: Sanjay Kasula

Dec 08, 2020 | 5:26 AM

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే సినిమా తెరకెక్కతోంది.

యుద్ధంతో రాసిన ప్రేమకథ చిత్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రాశీకన్నా.. ఆ హీరోయిన్‌ డేట్స్ కుదరకనే..
Follow us on

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనే సినిమా తెరకెక్కతోంది. ‘అందాల రాక్షసి’ ‘పడి పడి లేచే మనసు’ లాంటి లవ్‌స్టోరీలు తీసిన హను ఈ సినిమాను కూడా లవ్ ట్రాక్‌లోనే నడిపిస్తున్నాడు. ఇందులో దుల్కర్ కి జోడీగా స్టార్ హీరోయిన్లు పూజాహెగ్డే – రష్మిక మందన్న నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో విషయం వినిపిస్తోంది. హీరోయిన్ రష్మిక స్థానంలో రాశీకన్నాను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న రష్మికకు ఈ సినిమాలో నటించడానికి కుదరడం లేదట. దీంతో రాశిఖన్నాకు ఈ అవకాశం వచ్చిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే రాశిఖన్నా ప్రస్తుతం ‘తుగ్లక్ దర్బార్’ అనే తమిళ సినిమాలో చేస్తోంది. గతేడాది ఈమె ‘వెంకీమామ’ ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కాగా 1964 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది.