మొత్తానికి రాజమౌళిని ఒప్పించారుగా..!

| Edited By:

Apr 10, 2020 | 2:07 PM

కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌ వీడింది. మెగాస్టార్ మూవీలో రామ్ చరణ్‌ ఖరారు అయ్యారు. అంతేకాదు ఇందులో చెర్రీ నటించేందుకు రాజమౌళి నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది.

మొత్తానికి రాజమౌళిని ఒప్పించారుగా..!
Follow us on

కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌ వీడింది. మెగాస్టార్ మూవీలో రామ్ చరణ్‌ ఖరారు అయ్యారు. అంతేకాదు ఇందులో చెర్రీ నటించేందుకు రాజమౌళి నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది. అవును.. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. తన సినిమాలో చెర్రీ నటించేందుకు దర్శకధీరుడు ఒప్పుకున్నారని ఆయన అన్నారు.

కాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం చెర్రీని తీసుకోవాలని టీమ్‌ భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై చిరు సైతం మాట్లాడుతూ.. పాత్ర విన్న వెంటనే, దానికి చెర్రీనే సరిపోతాడని తాను, సురేఖ అనుకున్నామని అన్నారు. అయితే ప్రస్తుతం చెర్రీ ఆర్ఆర్ఆర్‌లో బిజీగా ఉండటం వలన.. ఇందులో నటించేందుకు ఇంకా డేట్లు ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయంలో కొరటాల శివ, రాజమౌళి మధ్య సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక తాజాగా మాట్లాడుతూ.. ఇందులో చెర్రీ నటించేందుకు జక్కన్న ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఈ మూవీలో తామిద్దరం గురు, శిష్యుల పాత్రల్లో కనిపించబోతున్నామని కూడా చిరు వివరించారు.

ఇదిలా ఉంటే తన సినిమాల్లో నటించే నటులకు సాధారణంగా కొన్ని రూల్స్‌ను పెడుతుంటారు రాజమౌళి. ఒకసారి తన మూవీకి ఒప్పుకుంటే.. ఆ మూవీ విడుదలయ్యే వరకు హీరోలు మరో సినిమాను సంతకం చేయకూడదనే నిబంధనను రాజమౌళిని పెడుతుంటారన్న టాక్ టాలీవుడ్‌లో ఉంది. ఆ క్రమంలోనే చిరు మూవీలో నటించే విషయంపై చెర్రీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంలో ఎట్టకేలకు చిరు, కొరటాల శివ ఇద్దరు కలిసి రాజమౌళిని ఒప్పించారని తెలుస్తోంది. ఏకంగా మెగాస్టార్ వచ్చి అడగడంతో రాజమౌళి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

Read This Story Also: ‘లూసిఫర్‌’కు డైరెక్టర్ అతడేనట.. కన్ఫర్మ్ చేసిన చిరు..!