రానాకు చికిత్స జరిగింది.. సంచలన విషయాలు చెప్పిన సురేష్ బాబు

| Edited By:

Oct 15, 2019 | 2:07 PM

టాలీవుడ్ భల్లాలదేవ రానా ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆరోగ్యం బావుందని రానా పలుమార్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించినప్పటికీ.. ఇటీవల ఆ హీరో ఎక్కువ యాక్టివ్‌గా లేకపోవడం.. విదేశాల్లోనే ఎక్కువ గడుపుతుండటంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడలేదు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రానా ఆరోగ్యంపై ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పష్టతను ఇచ్చారు. రానాకు చిన్నప్పుడే కంటి సమస్య ఉందని.. అయితే అప్పుడు చికిత్స చేస్తే […]

రానాకు చికిత్స జరిగింది.. సంచలన విషయాలు చెప్పిన సురేష్ బాబు
Follow us on

టాలీవుడ్ భల్లాలదేవ రానా ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆరోగ్యం బావుందని రానా పలుమార్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించినప్పటికీ.. ఇటీవల ఆ హీరో ఎక్కువ యాక్టివ్‌గా లేకపోవడం.. విదేశాల్లోనే ఎక్కువ గడుపుతుండటంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడలేదు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రానా ఆరోగ్యంపై ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పష్టతను ఇచ్చారు.

రానాకు చిన్నప్పుడే కంటి సమస్య ఉందని.. అయితే అప్పుడు చికిత్స చేస్తే తట్టుకోవడం కష్టమని చెప్పిన డాక్టర్లు.. పెద్దైన తరువాత చికిత్స తీసుకుంటే మంచిదని సూచించారని సురేష్ బాబు చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన చికిత్స ఈ మధ్యే పూర్తయ్యిందని.. అయితే సర్జరీ జరిగిన తర్వాత టెన్షన్ పడటంతో బీపీ అటాక్ అయ్యి.. కాస్త బలహీనంగా అయిపోయాడని సురేష్ బాబు తెలిపాడు. అంతేకానీ తన కుమారుడికి ఏం కాలేదని.. కొన్ని రోజుల్లో మళ్లీ మునుపటిలా తిరిగి వస్తాడు, చూడండి అంటూ ఆయన రూమర్లకు చెక్ పెట్టారు.

కాగా ఇటీవలే రానా ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇంకా హైదరాబాద్‌కు రాననప్పటికీ.. ఇప్పుడు ముంబైలో ఉన్నాడు. ప్రస్తుతం రానా చేతిలో అర డజన్‌కు పైగా చిత్రాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీలో పలు ప్రాజెక్ట్‌లను అతను ఒప్పుకున్నాడు. అయితే అనారోగ్యంతో కొన్నిరోజులుగా అన్ని షూటింగ్‌లకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన త్వరలోనే మళ్లీ సినమాలతో బిజీ అవ్వనున్నట్లు తెలుస్తోంది.