Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత మూడు రోజులుగా తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న వకీల్ సాబ్ కాషాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు. సంప్రదాయ రీతిలో కాషాయ పంచె కట్టుకొని వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఆలయం నుంచి వస్తున్న జనసేనానిని ఫొటో గ్రాఫర్స్ కెమెరాలో బంధించగా ఆయన ఫొటోలు వైరల్గా మారాయి. కాషాయ దుస్తులలో పవన్ని చూసిన ఫ్యాన్స్ ముగ్ధులవుతున్నారు.
కొద్దిరోజుల క్రితమే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ను పూర్తిచేశారు పవన్ కల్యాణ్. పార్టీకి సంబంధించిన పనులతో పవన్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే జనవరిలో పవన్ కల్యాణ్ క్రిష్ సినిమాను మొదలు పెట్టాలని భావిస్తుండగా, ఈ సినిమాని కేవలం నెల రోజులలోనే పూర్తి చేస్తారని సమాచారం. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్వకత్వంలో ఓ చిత్రం, మలయాళ రీమేక్ చిత్రాలు చేయనున్నారు. మలయాళ చిత్రం అయ్యప్పన్ కోషియుమ్కు రీమేక్గా తెరకెక్కనున్న చిత్రంలో రానా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా పవన్ సినిమా ఒక్కటి కూడా విడుదల కాకపోవడంతో ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఆన్లైన్లో ‘వకీల్ సాబ్’ సెట్లోని ఫోటోలు లీక్.. నెట్టింట్లో వైరల్గా మారిన పవన్ స్టిల్స్..