ముంబయి: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తప్పుకొన్నారు. కొంత షూటింగ్లో పాల్గొన్న శ్రద్ధ… చిత్రీకరణ జరుగుతున్న సమయంలో శ్రద్ధకు డెంగీ జ్వరం సోకడంతో ఆమెను సినిమా నుంచి తప్పించారు. ఈ విషయాన్ని సినిమాను తెరకెక్కిస్తున్న టీ సిరీస్ సంస్థ అధినేత భూషణ్కుమార్ వెల్లడించారు. శ్రద్ధ స్థానంలో సినీ నటి పరిణీతి చోప్రాను ఎంపిక చేసినట్లు తెలిపారు.
‘సైనా నెహ్వాల్ బయోపిక్లో నటించబోతున్న పరిణీతి చోప్రాకు స్వాగతం’ అని పేర్కొంటూ పరిణీతి ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం శ్రద్ధ.. సైనా కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద నెల రోజుల పాటు బ్యాడ్మింటన్లో మెళకువలు కూడా నేర్చుకున్నారు. ప్రీ లుక్ను కూడా విడుదల చేశారు. సినిమాను ఈ ఏడాదిలోనే పూర్తిచేసి 2020 చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నట్లు నిర్మాత భూషణ్కుమార్ వెల్లడించారు. అమోల్ సేన్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం శ్రద్ధ చేతిలో ‘సాహో’, ‘ఏబీసీడీ 3’, ‘బాఘి 3’, ‘చిచ్ఛోరే’ సినిమాలు ఉన్నాయి.
Delighted to welcome @ParineetiChopra on board for the Saina Nehwal biopic!
#AmoleGupte @NSaina @deepabhatia11 @sujay_jairaj @TSeries pic.twitter.com/dl7MP820Ov
— Bhushan Kumar (@itsBhushanKumar) March 15, 2019