హీరోలకే కాదు వారి ఫ్యాన్స్లకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఫ్యాన్స్ చాలా సెంటిమెంట్లను నమ్ముతుంటారు. ఇప్పుడు అలాంటి ఓ సెంటిమెంట్ను నమ్ముతోన్న మహేష్ ఫ్యాన్స్, తమ ఫేవరెట్ స్టార్ సరసన మహానటి కీర్తి సురేష్ వద్దంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ తదుపరి చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో హీరోయిన్గా కీర్తి సురేష్ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కీర్తి వద్దంటూ హీరోను అభ్యర్థిస్తున్నారు. పెద్ద హీరోల సరసన కీర్తి సురేష్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని.. అందుకే మహేష్ సరసన వద్దంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఈ మూవీ కోసం కియారాను తీసుకోవాలని వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. కాగా ఫ్యాన్స్ నుంచి వచ్చే అభ్యంతరాలను తరచుగా పట్టించుకునే మహేష్.. ఈ విషయంలో ఆలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ను సంప్రదించాలని దర్శకనిర్మాతలకు సూపర్స్టార్ సూచించినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? మహేష్ సరసన ఎవరు నటించబోతున్నారు..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Read This Story Also: నీ వల్లే ప్రేమంటే ఏంటో తెలిసింది.. బన్నీ భావోద్వేగ ట్వీట్..!