మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్స్టార్ శ్రీదేవీ నటించిన హిట్ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించింది. ఇక ఈ మూవీ విడుదలై ఈ నెల 9వ తేదీకి 30 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో వైజయంతీ మూవీస్ ఈ సినిమాకు సంబంధించి మూడు దాగి ఉన్న కథలను అభిమానులకు చెప్పేందుకు సిద్ధమైంది. వాటిని నాని తన వాయిస్ ఓవర్లో వినిపించనున్నారు. ఈ నెల 5,7,9 తేదీల్లో జగదేకవీరుడు- అతిలోకసుందరికి చెందిన మూడు దాగి ఉన్న కథలను నాని వినిపించబోతున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా 1990లో విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి అప్పట్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా మెగాస్టార్కు నాని పెద్ద అభిమాని అన్న విషయం తెలిసిందే.
Read This Story Also: భారత్లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ.. 2,500 పందులు మృత్యువాత..!
Are you excited to know some great stories about this historic film? Stay tuned to hear it from @NameisNani.#VintageVyjayanthi @KChiruTweets @Ragavendraraoba pic.twitter.com/2qMx8Jlm6x
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 3, 2020