‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కంటే.. ‘బిగ్‌బాసే’ నచ్చింది: నాగార్జున

| Edited By:

Jul 25, 2019 | 9:55 PM

బిగ్‌బాస్ త్రీపై ఎన్ని వివాదాలు చుట్టుముట్టయో అందరికీ తెలిసిందే. అన్నీ తప్పించుకుని ఫైనల్‌గా బిగ్‌బాస్ త్రీ స్టార్టయింది. అయితే.. షోపై ఇంత వివాదం అయినా.. కింగ్ నాగ్ మాత్రం నోరు విప్పలేదు. తాజాగా మన్మమథుడు2 చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ బిగ్‌బాస్ 3 గురించి మాట్లాడారు. బిగ్‌బాస్ షో నాకు సంతృప్తిగా ఉంది. మీలో ఎవరు కోటీశ్వరుడు చేసే సమయంలో.. ఒకే చోట బిగుసుకుని కూర్చోవాల్సి ఉండేది. కానీ.. ఇక్కడ మాత్రం చాలా కూల్‌గా అటు […]

మీలో ఎవరు కోటీశ్వరుడు కంటే.. బిగ్‌బాసే నచ్చింది: నాగార్జున
Follow us on

బిగ్‌బాస్ త్రీపై ఎన్ని వివాదాలు చుట్టుముట్టయో అందరికీ తెలిసిందే. అన్నీ తప్పించుకుని ఫైనల్‌గా బిగ్‌బాస్ త్రీ స్టార్టయింది. అయితే.. షోపై ఇంత వివాదం అయినా.. కింగ్ నాగ్ మాత్రం నోరు విప్పలేదు. తాజాగా మన్మమథుడు2 చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ బిగ్‌బాస్ 3 గురించి మాట్లాడారు. బిగ్‌బాస్ షో నాకు సంతృప్తిగా ఉంది. మీలో ఎవరు కోటీశ్వరుడు చేసే సమయంలో.. ఒకే చోట బిగుసుకుని కూర్చోవాల్సి ఉండేది. కానీ.. ఇక్కడ మాత్రం చాలా కూల్‌గా అటు ఇటు తిరుగుతూ అనుకున్నది చేస్తూ.. హోస్టింగ్ చేసే అవకాశం ఉంది.

ఇక.. కాంట్రవర్సిటీల గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు.. పట్టించుకోను అని అన్నారు. ఈ విషయాల గురించి కూడా నేను స్పందించదలుచుకోలేదు. బిగ్‌బాస్ త్రీ అనేది 15 దేశాల్లో ఉంది. మన ఇండియాలో హిందీలో 12 సీజన్‌లు పూర్తి చేసుకుని వివిధ భాషల్లో ప్రసారం అవుతుంది. పుకార్లు.. కాంట్రవర్సిటీలు గాల్లోంచి కూడా పుడతాయి. వివాదం ఏంటో నాకు తెలీదన్నారు. ఎవరు తప్పు చేసినా శిక్ష పడుతుందంటూ నాగ్ చెప్పారు. ఇక పార్టిసిపెంట్స్ గురించి కూడా నాకు ముందు తెలీదు. షో స్టార్టయ్యే కొద్దిసేపటి ముందు మాత్రమే తెలుసని చెప్పారు నాగార్జున.