సినీ ఇండస్ట్రీ తరఫున నేను చెప్తున్నా మమ్మల్ని క్షమించు సుశాంత్ అని సుశాంత్ సింగ్ రాజ్పుత్ గురించి భావోద్వేగ ట్వీట్ను పెట్టారు నటి మీరా చోప్రా. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసిన మీరా.. ఇండస్ట్రీకి కూడా ఆమె ఓ రిక్వెస్ట్ చేశారు.
”క్రూరమైన, పట్టించుకోని, బాధాకరమైన ఇండస్ట్రీలో నివసిస్తూ మేము పనిచేస్తున్నాం. సుశాంత్ చాలా రోజులుగా డిప్రెషన్లో ఉన్నాడని విషయం మా అందరికి తెలుసు. కానీ మేము ఏం చేశాము. ఆయన సన్నిహితులు ఎక్కడుతున్నారు..? ఆయనతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, క్లోజ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు..? ఎందుకు ఎవ్వరు ముందుకొచ్చి అతడికి చిన్న పాటి ప్రేమను పంచలేకపోయారు. అదొక్కటే అతడు కూడా కోరుకున్నది. కానీ మేము దేన్ని పట్టించుకోము. నన్ను క్షమించు కానీ మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ ముందుకురారు. నీ ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు నిన్నో అంటరానివాడిలా చూస్తారు.
నిజం చెప్పాలంటే బాలీవుడ్ ఒక చిన్న కుటుంబం. కానీ మనకు అవసరమైనప్పుడు ఎవ్వరూ సాయం చేయని కుటుంబం. అలాంటి వారి కోసం ఇప్పుడు అతడు ప్రాణాలు తీసుకున్నాడు. బయటి వారిని ఇక్కడ ఎప్పుడూ బయటి వారులాగే చూస్తుంటారు. నా ఇండస్ట్రీకి నేను ఒక్కటే చెప్తున్నా. ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు వారికి సాయం చేయండి. వారు లేనప్పుడు ట్వీట్ చేయడంలో ఎలాంటి అర్థం ఉండదు. అతడు బాధలో ఉన్నప్పుడు ఏం చేయలేని మీరు ఇప్పుడు నటించకండి. సుశాంత్ నీ మృతి నిజంగా వ్యక్తిగతంగా కలిచివేసింది. కానీ ఇప్పటికైనా ఇండస్ట్రీ మారుతుందని భావిస్తున్నా. నిన్ను మేమే ఓడించాము. ఈ ఇండస్ట్రీ నువ్వు ఓడిపోయేలా చేసింది. నీకు నిజంగా మంచి జరగాల్సి ఉండాల్సింది ఫ్రెండ్. నన్ను క్షమించు” అని ఆమె కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు నిజమేనంటూ తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.
Read This Story Also: ఆ లోపు రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలి: కేసీఆర్ ఆదేశం
My apology to #sushant on behalf of the entire industry and a humble request to my industry folks!! pic.twitter.com/PJHhet6V6I
— meera chopra (@MeerraChopra) June 15, 2020