అదే మా సక్సెస్‌ఫుల్ మ్యారేజ్ సీక్రెట్

| Edited By:

Oct 06, 2019 | 2:02 PM

టాలీవుడ్‌ క్యూట్ కపుల్‌ లిస్ట్‌లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కచ్చితంగా ఉంటారు. వంశీ సినిమా ద్వారా కలిసిన ఈ ఇద్దరు.. ఆ తరువాత దాదాపు ఐదేళ్లపాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా వీరి వివాహం జరిగి 14 ఏళ్లు పూర్తి అవ్వగా.. ఇప్పటికీ ఒకరికొరు గౌరవించుకుంటూ గౌరవప్రదంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన మ్యారేజ్ లైఫ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు మహేష్. […]

అదే మా సక్సెస్‌ఫుల్ మ్యారేజ్ సీక్రెట్
Follow us on

టాలీవుడ్‌ క్యూట్ కపుల్‌ లిస్ట్‌లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కచ్చితంగా ఉంటారు. వంశీ సినిమా ద్వారా కలిసిన ఈ ఇద్దరు.. ఆ తరువాత దాదాపు ఐదేళ్లపాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా వీరి వివాహం జరిగి 14 ఏళ్లు పూర్తి అవ్వగా.. ఇప్పటికీ ఒకరికొరు గౌరవించుకుంటూ గౌరవప్రదంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన మ్యారేజ్ లైఫ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు మహేష్.

‘‘నమ్రత, నేను పెళ్లి చేసుకొని 14 ఏళ్లు పూర్తి అయ్యింది. మేము ఒకరినొకరిని పూర్తిగా అర్థం చేసుకుంటాం. ఒకరిని ఒకరం గౌరవించాం. అదే మా సక్సెస్‌ఫుల్ మ్యారేజ్‌ సీక్రెట్’’ అంటూ మహేష్ చెప్పుకొచ్చారు. అలాగే తన పిల్లలు కూడా తన జీవితాన్ని చాలా మార్చారని ఆయన చెప్పుకొచ్చారు. కుటుంబంతో ఎలా మెలగాలి అన్నది తన తండ్రి నుంచి నేర్చుకున్నానని.. ఈ విషయంలో పూర్తి క్రెడిట్ తన తండ్రికే ఇస్తానని తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి రాగానే తన తండ్రి ఒక స్టార్ అన్న విషయాన్ని మరిచిపోతారని మహేష్ పేర్కొన్నాడు.

ఇక కష్టకాలంలో నమ్రత తన వెంటనే ఉంటుందని ఆయన తెలిపారు. ‘‘ఫెయిల్యూర్‌ నుంచి నేను ఎంతో నేర్చుకుంటా. ఏదైనా పరాజయం వచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఆ సమయంలో నమ్రత నా ఆలోచనను మారుస్తూ ఉంటుంది’’ అని మహేష్ తెలిపాడు. కాగా ఈ ఏడాది ‘మహర్షి’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.