ఉపాసన చేతుల మీదుగా ‘కథనం’ టీజర్ రిలీజ్

| Edited By:

Mar 08, 2019 | 8:00 PM

అనసూయ ప్రధాన పాత్రగా .. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వంలో ‘కథనం’ సినిమా నిర్మితమైంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో పృథ్వీ .. అవసరాల .. వెన్నెల కిషోర్ .. ధన్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ‘మహిళా దినోత్సవం’ సందర్భాన్ని పురస్కరించుకుని, సినిమా టీజర్ ను రాంచరణ్ సతీమణి ఉపాసన చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ప్రధాన పాత్రలకి సంబంధిచిన ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. కథాపరంగా అనసూయ స్క్రిప్ట్ రైటర్ .. […]

ఉపాసన చేతుల మీదుగా కథనం టీజర్ రిలీజ్
Follow us on

అనసూయ ప్రధాన పాత్రగా .. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వంలో ‘కథనం’ సినిమా నిర్మితమైంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో పృథ్వీ .. అవసరాల .. వెన్నెల కిషోర్ .. ధన్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ‘మహిళా దినోత్సవం’ సందర్భాన్ని పురస్కరించుకుని, సినిమా టీజర్ ను రాంచరణ్ సతీమణి ఉపాసన చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ప్రధాన పాత్రలకి సంబంధిచిన ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. కథాపరంగా అనసూయ స్క్రిప్ట్ రైటర్ .. ఆమె తన స్క్రిప్ట్ లో రాసుకున్నట్టుగానే బయట సంఘటనలు జరుగుతుంటాయి. తాను ఊహించుకుని రాసిన సంఘటనలు నిజంగానే జరుగుతూ ఉండటంతో, ఆమె భయాందోళనలకు లోనవుతూ ఉండటం ఈ టీజర్లో చూపించారు. ‘నిర్ణయాలు తీసుకోవలసినవాళ్లు నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకరు మేల్కొంటారు సార్’ అనే డైలాగ్ బాగుంది.ఈ వేసవి సెలవుల్లో సినిమాను ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.