కరణ్‌ ఏడుస్తూనే ఉన్నాడట

| Edited By:

Jul 09, 2020 | 2:06 PM

సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

కరణ్‌ ఏడుస్తూనే ఉన్నాడట
Follow us on

సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లోని నెపోటిజయం వలనే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడని నటీనటులు మొదలు సుశాంత్‌ ఫ్యాన్స్‌ సోషల్ మీడియా వేదికగా విమర్శలు కురిపించారు. అయితే ఈ విమర్శలతో కరణ్‌ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆయన మిత్రుడు తెలిపారు. ”సుశాంత్‌ మరణం తరువాత తనపై వస్తోన్న విమర్శలతో కరణ్‌ చాలా కలత చెందాడు. అసలు నేను ఏం తప్పు చేశానంటూ కుంగిపోతూ ఏడుస్తూనే ఉన్నాడు” అని కరణ్ స్నేహితుడు వివరించారు.

మరి విమర్శలపై ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నకు.. ”ఇలాంటి పరిస్థితుల్లో స్పందించకుండా ఉండటమే మంచిదని లాయర్‌ సూచించాడు. అందుకే కరణ్‌ ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు” అని మిత్రుడు పేర్కొన్నారు. కాగా సుశాంత్‌ ఆత్మహత్య నేపథ్యంలో కరణ్‌ జోహార్‌, అలియా భట్‌, సోనాక్షి సిన్హా, సోనమ్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌, అనన్యా భట్‌ సహా పలువురిపై విమర్శలు గుప్పించారు. దీంతో సోనాక్షి ట్విట్టర్‌కి గుడ్‌బై చెప్పగా.. కరణ్‌, అలియా, సోనమ్‌, కరీనా కపూర్ తమ ఖాతాల్లో పోస్టింగ్‌లను పరిమితం చేశారు. అంతేకాదు వారి ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోయిన విషయం తెలిసిందే.