కరోనా నుంచి కోలుకుంటే అలాంటి కామెంట్లు చేశారు.. బాధపడ్డ మిల్కీ బ్యూటీ తమన్నా

| Edited By:

Nov 12, 2020 | 9:02 PM

మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన తమన్నాకు కరోనాగా నిర్ధారణ కాగా

కరోనా నుంచి కోలుకుంటే అలాంటి కామెంట్లు చేశారు.. బాధపడ్డ మిల్కీ బ్యూటీ తమన్నా
Follow us on

Tamannaah on trolls: మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన తమన్నాకు కరోనాగా నిర్ధారణ కాగా.. ఆ తరువాత ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందిన మిల్కీబ్యూటీ ఈ మహమ్మారిని పూర్తిగా జయించారు. అయితే ఆ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను మాత్రం తమన్నా ఇంకా మర్చిపోలేకపోతున్నారు. కరోనా సోకినప్పుడు చనిపోతాననుకున్నానని తమన్నా ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.( హీరోయిన్ల రెమ్యునరేషన్‌ లీక్‌.. కీర్తి పారితోషికం అంతేనా..!)

”నాకు ప్రతి తీవ్ర లక్షణం ఉండేవి. తీవ్ర లక్షణాలు ఉన్న చాలా మంది చికిత్స తీసుకుంటూ చనిపోయారు. నేను కూడా చచ్చిపోతానేమోనని భయం ఉండేది. కానీ వైద్యులు నాలో ధైర్యాన్ని నింపి, నన్ను కాపాడారు” అని చెప్పారు. ఇక తాజాగా మరో ఇంటర్వ్యూలో తాను కోలుకున్న తరువాత వచ్చిన ట్రోల్స్ గురించి తమన్నా వెల్లడించారు. (హెర్బల్ ఆయిల్ పేరుతో కుచ్చుటోపి.. రూ.52లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు)

”మనచుట్టూ ఎంత కఠినాత్ములు ఉంటారంటే.. నేను కోలుకొని ఆరోగ్యంగా ఉన్నాననుకుంటే, నా లుక్‌పై కామెంట్లు చేశారు. కరోనా సమయంలో తీసుకున్న మెడిసిన్ వలన కాస్త ఒళ్లు వచ్చింది. దీంతో తమన్నా లావు అయ్యిందంటూ కామెంట్లు చేశారు. కానీ ఆ సమయంలో నేను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాత్రం ఎవ్వరికీ తెలీదు” అంటూ బాధపడ్డారు. కాగా కరోనాను జయించిన తమన్నా.. ఇప్పుడు సినిమాల షూటింగ్‌పై దృష్టి పెడుతున్నారు. (కరోనా నుంచి కోలుకున్న స్మృతి ఇరానీ)