మూడు నెలల పాటు తీరిక లేకుండా ‘సాహో’ సినిమా విడుదల, ప్రమోషన్స్ వ్యవహారాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఫారిన్ చెక్కేశాడు. అక్కడ హాయిగా సేద దీరనున్నాడు. యూరప్లో కొన్నాళ్లు రిలాక్స్ అయి వచ్చే నెలలో ఇండియాకి తిరిగొస్తాడట. ఆదివారం పారిస్కి పయనం అయ్యాడు.
సాహో సినిమా రిలీజ్కి ముందే ప్రభాస్.. ఒక రొమాంటిక్ సినిమా మొదలుపెట్టాడు. ‘జిల్’ సినిమా తీసిన.. డైరెక్టర్తో గతేడాదే సినిమా మొదలుపెట్టాడు ప్రభాస్. హీరోయిన్గా పూజా హెగ్డేని తీసుకున్నారు. ఇప్పటికే ఇటలీలో 30 రోజులపాటు అక్కడ షూటింగ్ తీశారు. అయితే ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ని మళ్లీ మొదలుపెట్టాలంటే.. ఫ్రెష్గా కనిపించాలని.. రిలాక్సేషన్ కోసం ఫారిన్ వెళ్లాడు.
సాహో సినిమా బాలీవుడ్లో సూపర్ హిట్టయింది. కానీ తెలుగులో ఫ్లాప్. ఇక తమిళ, మలయాళ భాషల్లో డిజాస్టర్. వసూళ్ల సంఖ్య పరంగా చూస్తే… చాలా పెద్ద ఫిగరే వచ్చింది. కానీ.. ఏరియా వైజ్గా చేస్తే కొన్ని చోట్ల లాభాలు, మరికొన్నిచోట్ల నష్టాలను చూపింది. యూరివర్సల్గా అందర్నీ ఆకట్టుకోలేకపోయింది. నెక్ట్స్ సినిమా విషయంలో ఈ పొరపాట్లు జరగొద్దనే ఉద్ధేశ్యంతో.. దర్శకుడికి స్క్రిప్ట్లో ఛేంజస్ చేయమని చెప్పి పారిస్ వెళ్లాడట ప్రభాస్.
రెండు నెలల తర్వాతే ప్రభాస్ మళ్లీ షూటింగ్లో పాల్గొంటాడట. వచ్చే ఏడాది ఆగస్ట్కి ఈ కొత్త సినిమాని రిలీజ్ చేస్తాడట. అలాగే.. మరో రెండు కొత్త సినిమాలను కూడా ఒప్పుకునేందుకు పలువురు దర్శకులతో చర్చలు జరపనున్నాడు సాహో స్టార్.