Tollywood: ఒకప్పుడు రొమాన్స్‌లో రారాజు.. వరుస హిట్లతో ఇండస్ట్రీ షేక్.. ఇప్పుడు విలన్‏గా కొత్త అవతారం..

|

Jun 29, 2024 | 9:58 AM

20 ఏళ్లుగా సినీ ప్రపంచంలో టాప్ హీరోగా వెలుగుతున్నాడు. కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు ఎన్నో గుర్తిండిపోయే పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద వరుసగా హిట్ చిత్రాలతో భారీ కలెక్షన్స్ రాబట్టాడు. అతడిని ఇండస్ట్రీలో రొమాన్స్ రారాజు అని పిలుచుకుంటారు. ఒకప్పుడు ఎన్నో సినిమాలతో స్టార్ హీరోగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు విలన్ గా వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..

Tollywood: ఒకప్పుడు రొమాన్స్‌లో రారాజు.. వరుస హిట్లతో ఇండస్ట్రీ షేక్.. ఇప్పుడు విలన్‏గా కొత్త అవతారం..
Actor
Follow us on

20 ఏళ్లుగా సినీ ప్రపంచంలో టాప్ హీరోగా వెలుగుతున్నాడు. కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు ఎన్నో గుర్తిండిపోయే పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద వరుసగా హిట్ చిత్రాలతో భారీ కలెక్షన్స్ రాబట్టాడు. అతడిని ఇండస్ట్రీలో రొమాన్స్ రారాజు అని పిలుచుకుంటారు. ఒకప్పుడు ఎన్నో సినిమాలతో స్టార్ హీరోగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు విలన్ గా వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..? అతడే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో హీరోగా దూసుకుపోతున్నాడు. 2004లో విడుదలైన మర్డర్ సినిమా ఇమ్రాన్ హష్మీని ఓవర్ నైట్ స్టార్ గా మార్చింది. ఈ మూవీతో ఇమ్రాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

ఆ తర్వాత ఇమ్రాన్ నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. కానీ ఆ తర్వాత వరుసగా ప్లాపులు చవిచూశాడు. ఇప్పుడు స్టార్ హీరోస్ సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. అలాగే సైడ్ హీరోగానూ పలు సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇటీవల అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సెల్ఫీ సినిమాలో సెకండ్ హీరోగా కనిపించాడు. గత కొన్నేళ్లుగా ఇమ్రాన్ ఒక్క హిట్ అందుకోలేకపోయాడు. అతడు నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. కానీ ఇప్పుడు విలన్ పాత్రలతో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు ఇమ్రాన్. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ కొన్ని నెలలుగా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత ఇమ్రాన్ తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించనున్నారు. జన్నత్, మర్డర్ 2, ది డర్టీ పిక్చర్ వంటి హిట్ చిత్రాల్లో నటించనున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.