Ramayanam Movie: అంచనాలు పెంచేస్తోన్న నితేశ్ తివారీ ‘రామాయణం’.. ఆ పాత్రలో అమితాబ్ బచ్చన్..

|

Feb 13, 2024 | 7:45 AM

ఇతిహాసం ఆధారంగా ఈ మూవీని తీసుకురానున్నారు. ఇందులో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారని సమాచారం. అలాగే రావణుడిగా కేజీఎఫ్ స్టార్ హీరో యశ్ నటిస్తారని తెలుస్తోంది. అలాగే ఆంజనేయుడి పాత్రలో బీటౌన్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో రకుల్ శుర్పణఖ పాత్రలో నటిస్తున్నారని.. యానిమల్ స్టార్ బాబీ డియోల్ మరో పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది.

Ramayanam Movie: అంచనాలు పెంచేస్తోన్న నితేశ్ తివారీ రామాయణం.. ఆ పాత్రలో అమితాబ్ బచ్చన్..
Amitabh Bachchan
Follow us on

బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ తెరకెక్కించనున్న ‘రామాయణం’ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ భారీ తారాగణంతో ఈ మూవీని రూపొందించనున్నారని కొన్నాళ్లుగా టాక్ వినిపిస్తుంది. ఇతిహాసం ఆధారంగా ఈ మూవీని తీసుకురానున్నారు. ఇందులో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారని సమాచారం. అలాగే రావణుడిగా కేజీఎఫ్ స్టార్ హీరో యశ్ నటిస్తారని తెలుస్తోంది. అలాగే ఆంజనేయుడి పాత్రలో బీటౌన్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో రకుల్ శుర్పణఖ పాత్రలో నటిస్తున్నారని.. యానిమల్ స్టార్ బాబీ డియోల్ మరో పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ మూవీలో అమితాబ్ కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారట. శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు పాత్రను అమితాబ్ చేయనున్నారని సమాచారం. ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. గతంలో బ్రహ్మాస్త్ర చిత్రంలో రణబీర్, అమితాబ్ కలిసి నటించారు. ఇప్పుడు రామాయణం మూవీలో ఇప్పుడు మరోసారి కలిసి కనిపించనున్నారు. అలాగే రామాయణం మూవీలో కైకేయి పాత్రలో లారా దత్తా, కుంభకర్ణుడిగా బాబీ డియోల్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ డీటేయిల్స్ మాత్రం తెలియరాలేదు.

ఈ ఏడాది మార్చిలో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఇటీవలే యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు రణబీర్ కపూర్. అలాగే ప్రస్తుతం సాయి పల్లవి తండేల్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ పూర్తయ్యాక రామాయణం షూటింగ్ స్టార్ట్ కానుంది. అలాగే అమితాబ్ కల్కి 2898 ఏడీ చిత్రంలో నటిస్తున్నారు. మొత్తానికి భారీ తారాగణంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రామయాణం మూవీని రూపొందించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.