నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తుంది. అందులో ఒకటి అఘోర పాత్ర అని అంటున్నారు. సింహా, లెజెండ్ సినిమాలతర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూట్ జరుపుకుంటుంది. ఆమధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా లో కంచె బ్యూటీ ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ గుంటూరు జిల్లా పల్నాడు లో జరగనుంది. పల్నాడు లోని కోటప్పకొండ ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్లో కీలక సన్నివేశాలు షూట్చేయనున్నాడు బోయపాటి. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నాడట బోయపాటి. బీబీ 3 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అందుకోవడం ఖాయం అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read :
chaysam pics viral: వైరల్గా మారిన సమంత, నాగచైతన్య ఫొటోలు.. న్యూ ఇయర్ వేడుక కోసమే వీరి ప్రయాణం..