నితిన్ దర్శకుడితో అల్లువారబ్బాయి..?

|

May 21, 2019 | 7:10 PM

అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘ఏబీసీడీ’. ఈ సినిమా గత శుక్రవారం రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అందుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం తన తదుపరి చిత్రం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడట శిరీష్. ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఫేమ్ ప్రేమ్ సాయితో అల్లు శిరీష్ ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ శిరీష్‌కు కథ వినిపించాడని.. నటించడానికి సుముఖంగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. […]

నితిన్ దర్శకుడితో అల్లువారబ్బాయి..?
Follow us on

అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘ఏబీసీడీ’. ఈ సినిమా గత శుక్రవారం రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అందుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం తన తదుపరి చిత్రం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడట శిరీష్.

‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఫేమ్ ప్రేమ్ సాయితో అల్లు శిరీష్ ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ శిరీష్‌కు కథ వినిపించాడని.. నటించడానికి సుముఖంగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడనుందట. అటు తమిళంలో కూడా ఓ సినిమా చేయాలనీ శిరీష్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.