‘చెక్క చివంత వానమ్’(తెలుగులో నవాబ్)తో మళ్లీ ఫాంలోకి వచ్చిన లెజండరీ దర్శకుడు మణిరత్నం.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ను పొన్నియన్ సెల్వన్ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా చోళ రాజ్యంకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ఓ కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆ మధ్యన ఐష్ కూడా కన్ఫర్మ్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఆమె తల్లి, కుమార్తె పాత్రల్లో డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చోళ రాజు పెరియ పళువెట్టరాయర్ భార్య నందిని పాత్రలో ఆమె నటించబోతున్నట్లు అప్పట్లో వార్తలు రాగా.. ఇప్పుడు ఆమె తల్లి మందాకినీ దేవీ(మూగ రాణి)పాత్రలో కూడా ఐష్ కనిపించబోతున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
అయితే భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటించనుంది. చియాన్ విక్రమ్ అదిత్య కరికాలన్గా, కార్తీ వల్లవారియన్ వండియదేవన్గా, జయం రవి రాజా రాజా చోలా గా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెరియ పళువెట్టరాయర్గా కనిపించబోతున్నారు. అలాగే కీర్తి సురేష్ కుందవై పాత్రలో నటించనుంది. వీరితో పాటు మరో కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కూడా కనిపించబోతున్నట్లు టాక్. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.