Rashmika: ‘పుష్ప’ (Pushpa) సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార రష్మిక మందన. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో నటించినా, యాక్టింగ్తో మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా రష్మిక నేషనల్ క్రష్ (National Crush) అనే పేరును సంపాదించుకుంది. ఇక బాలీవుడ్లో ఆఫర్లు సైతం క్యూ కట్టాయి. సౌత్తో పాటు నార్త్లోనూ వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్లో నటిస్తోన్న చిత్రాల్లో ‘యానిమల్’ ఒకటి. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా స్పెషల్ సాంగ్లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ క్రమంలోనే తొలి రోజు లుక్ టెస్ట్కు హాజరైన రష్మిక అంనతరం బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘మొదట్లో రణ్బీర్ ఎలా ఉంటాడో అని చాలా భయపడ్డాను. కానీ అయిదు నిమిషాల్లోనే అతను ఎలాంటి వాడో తెలిసిపోయింది. రణ్బీర్ ఎంతో సింపుల్గా ఉంటాడు. తనతో పని చేయడం చాలా ఆనందం అనిపించింది. సినిమా ఇండస్ట్రీలో నన్ను ‘మేడమ్’ అని పిలిచే ఏకైన వ్యక్తి రణ్బీర్’ అని చెప్పుకొచ్చింది రష్మిక.
ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం బాలీవుడ్లో గుడ్బై, మిషన్మజ్ను చిత్రాలతో పాటు పుష్ప2 పాన్ ఇండియాలో నటిస్తోంది. బాలీవుడ్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్న రష్మికకు ఈ సినిమాలు ఏమేర సహాయపడతాయో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..